బాయ్కాట్.. బాయ్కాట్.. బాయ్కాట్.. ఈ మధ్య సోషల్ మీడియాలో బాలీవుడ్ సినిమాలకు సంబంధించి తరచుగా వినిపిస్తున్న మాట ఇది. ఒకప్పటి విషయాలను బయటికి తీసి.. ఇప్పుడు రిలీజవుతున్న సినిమాలకు ముడిపెట్టి.. వాటిని బాయ్కాట్ చేయాలని హిందీ ప్రేక్షకుల్లో కొన్ని వర్గాలు రాద్దాంతం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. అసలే కొవిడ్ తర్వాత బాలీవుడ్ సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది.
ఒకప్పుడు రిలీజ్ రోజున పది కోట్లకు పైగా వసూళ్లు అలవోకగా వచ్చేసేవి. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా 3-4 కోట్ల డే-1 వసూళ్లు వస్తుండటం షాకిస్తోంది. పరిస్థితి అసలే ఘోరంగా ఉంటే.. సినిమా విడుదలకు ముందే బాయ్కాట్ బ్యాచ్ మరింత ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తోంది. అసలు సినిమాలో ఏం ఉందో.. అది ఎలాంటి సినిమానో చూడకుండా నటుల వ్యక్తిగత విషయాలను బయటికి తీసి వాటితో సినిమాకు ముడిపెట్టి ‘బాయ్కాట్ బాయ్కాట్’ అనడం కరెక్ట్ కాదని కొంతమంది సినీ ప్రముఖుల అభిప్రాయం.
తరచుగా ట్రెండ్లో ముఖ్యంగా రెండు వర్గాలు పాల్గొంటున్నాయి. ఒకటి సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులుగా చెప్పుకుంటున్న వర్గం. అతడి మరణానికి బాలీవుడ్లోని బడా బాబులే కారణమన్న అభిప్రాయంతో ఉన్న ఈ వర్గం.. ఖాన్ త్రయంతో పాటు బాలీవుడ్ స్టార్ కిడ్స్ అందరినీ టార్గెట్ చేస్తోంది. ఇక మరో వర్గం.. బాలీవుడ్లో ఎప్పుడూ హిందుత్వాన్ని కించపరిచే సినిమాలే తీస్తుంటారని.. బాలీవుడ్లో చాలామంది మీద ఆ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. గతంలో కొన్ని సినిమాల్లో ఉన్న హిందూ వ్యతిరేక సన్నివేశాలకు, బయట ఇచ్చిన స్టేట్మెంట్లకు, వారి ప్రవర్తనకు ముడి పెడుతూ ఆయా స్టార్ల కొత్త సినిమాలను ఈ వర్గం టార్గెట్ చేస్తోంది.
ఈ రెండు వర్గాలూ ఈ మధ్య ఏ పెద్ద సినిమా రిలీజైనా.. బలంగా బాయ్కాట్ ట్యాగ్స్ ను స్ప్రెడ్ చేస్తున్నాయి. తాజాగా ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా విషయంలో కూడా గతంలో ఆయన చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. ఐతే రోజు రోజుకూ ఈ నెగెటవిటీ శ్రుతి మించిపోతే సినిమాల పరిస్థితి దారుణంగా తయారవుతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on August 2, 2022 4:22 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…