స్టేజి మీద లేదా నలుగురి మధ్య ఉన్నప్పుడు రాబోయే సినిమాల గురించి లీకులు ఇవ్వడం మెగాస్టర్ చిరంజీవికి ఈ మధ్య అలవాటుగా మారిపోయింది. దీని మీద సోషల్ మీడియాలో చాలా మీమ్స్ కూడా వచ్చాయి. రంగస్థలంలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ చనిపోవడంతో మొదలుపెట్టి ఆచార్య టైటిల్ ని టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి ముందే లీక్ చేయడం దాకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తెలుగు వెర్షన్ కి తాను సమర్పకుడిగా వ్యవహరిస్తున్న లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్ లో మరోసారి ట్విస్టు ఇచ్చేశారు.
సినిమాలోని కంటెంట్ ని గొప్పగా పొగిడే క్రమంలో లాల్ సింగ్ చడ్డాని చాలా ఓపిగ్గా చూడాలని అలా అయితేనే అందులో ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయని మైక్ ముంచు చెప్పేశారు. అయినా ప్రేక్షకులు థియేటర్లో కూర్చునేది ఓపికతో కాదుగా.. సరదాగా టైం పాస్ కావాలని లేదా మంచి ఎంటర్ టైన్మెంట్ దొరుకుతుందని. అంతే తప్ప తమ సహనానికి పరీక్ష పెట్టే కళాఖండాలకు ఈ మధ్య ఎన్ని వాతలు పెట్టారో ఆచార్య నుంచి థాంక్ యు దాకా ఎన్నో చూస్తున్నాం. అయినా ఇలా ఓపిక పదాన్ని నొక్కి చెప్పడమే ఏదో ల్యాగ్ ఉందన్న అనుమానం కలిగిస్తోంది.
అసలే అమీర్ ఖాన్ ఎన్నడూ లేనిది లాల్ సింగ్ కోసం హైదరాబాద్ కు పదే పదే వస్తున్నాడు. గతంలో మంగళ్ పాండే, దంగల్ లాంటివి తెలుగులో డబ్ అయినప్పటికీ ఈ వర్సటైల్ యాక్టర్ ఏనాడూ మన మీడియా ముందుకు రాలేదు. కానీ లాల్ సింగ్ ని మాత్రం చాలా పర్సనల్ గా తీసుకుని ఇక్కడ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రీమియర్లు వేస్తున్నాడు. ఇలాంటి టైంలో చిరంజీవి ప్రత్యేకంగా ఓపిక, హై ఎమోషనల్, కన్నీళ్లు వస్తాయని చెప్పడం చూస్తే వినోదం మాత్రమే ఆశించే సగటు ప్రేక్షకులు దీని వైపు చూడకపోయే రిస్క్ ఉంది. ఏమైనా తాను మొదటిసారి సమర్పకుడి వ్యవహరిస్తున్నాడు కాబట్టి మెగాస్టార్ ఈ లాల్ సింగ్ ని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు .
This post was last modified on July 25, 2022 4:12 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…