Movie News

శ్రద్ధ శ్రీనాధ్ పంట పండింది!

లాక్ డౌన్లో భారతీయ చిత్ర పరిశ్రమకు థియేటర్ బిజినెస్ కు ప్రత్యామ్నాయం దొరికింది. ఓటిటీ లో చిన్న సినిమాలు విడుదల చేస్తే లాభదాయకం అని తేలింది. ఇలా విడుదల చేయడం వల్ల సినిమా మామూలుగా ఉందని టాక్ వచ్చినా కానీ చూడాలనుకున్న వాళ్ళు, ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేస్తున్నారు. దీంతో లాక్ డౌన్ తర్వాత డిజిటల్ కంటెంట్ పెద్ద స్థాయిలో రూపొందించడానికి పెద్ద నిర్మాణ సంస్థలు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే టీవీని ఎలాగైతే సినిమా వాళ్ళు చిన్నగా చూస్తారో, స్టార్లు ఓటిటీని కూడా అలాగే చూస్తారు.

అందుకే ఈ ఫీల్డ్ చిన్న తారలకు బాగా కలిసి వస్తుంది. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో జెర్సీ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్ అందరి దృష్టిలో పడింది. ఆమె నటించిన తమిళ చిత్రం చక్ర కూడా ఓటిటీలోనే విడుదల కానుంది. దీంతో ఆమెకు డిజిటల్ కంటెంట్ చేయడానికి ఇక అభ్యంతరం ఉండదు కనుక పలువురు నిర్మాతలు, ప్రొడక్షన్ మేనేజర్లు శ్రద్ధ డేట్స్ ఇప్పట్నుంచే లాక్ చేయాలని చూస్తున్నారు. శ్రద్ధ శ్రీనాధ్ కన్నడ, తమిళంలో కూడా పాపులర్ అవడం వల్ల డిజిటల్ కంటెంట్ రీచ్ కి ఆమె చాలా ప్లస్ అవుతుంది.

This post was last modified on July 1, 2020 8:50 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

26 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

51 minutes ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

57 minutes ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

1 hour ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago