లాక్ డౌన్లో భారతీయ చిత్ర పరిశ్రమకు థియేటర్ బిజినెస్ కు ప్రత్యామ్నాయం దొరికింది. ఓటిటీ లో చిన్న సినిమాలు విడుదల చేస్తే లాభదాయకం అని తేలింది. ఇలా విడుదల చేయడం వల్ల సినిమా మామూలుగా ఉందని టాక్ వచ్చినా కానీ చూడాలనుకున్న వాళ్ళు, ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేస్తున్నారు. దీంతో లాక్ డౌన్ తర్వాత డిజిటల్ కంటెంట్ పెద్ద స్థాయిలో రూపొందించడానికి పెద్ద నిర్మాణ సంస్థలు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే టీవీని ఎలాగైతే సినిమా వాళ్ళు చిన్నగా చూస్తారో, స్టార్లు ఓటిటీని కూడా అలాగే చూస్తారు.
అందుకే ఈ ఫీల్డ్ చిన్న తారలకు బాగా కలిసి వస్తుంది. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో జెర్సీ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్ అందరి దృష్టిలో పడింది. ఆమె నటించిన తమిళ చిత్రం చక్ర కూడా ఓటిటీలోనే విడుదల కానుంది. దీంతో ఆమెకు డిజిటల్ కంటెంట్ చేయడానికి ఇక అభ్యంతరం ఉండదు కనుక పలువురు నిర్మాతలు, ప్రొడక్షన్ మేనేజర్లు శ్రద్ధ డేట్స్ ఇప్పట్నుంచే లాక్ చేయాలని చూస్తున్నారు. శ్రద్ధ శ్రీనాధ్ కన్నడ, తమిళంలో కూడా పాపులర్ అవడం వల్ల డిజిటల్ కంటెంట్ రీచ్ కి ఆమె చాలా ప్లస్ అవుతుంది.
This post was last modified on July 1, 2020 8:50 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…