Movie News

చై-సామ్.. ఒక ఇంటి కథ

టాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్ జాబితా తీస్తే నాగచైతన్య-సమంతల జంట పేరు కచ్చితంగా ఉంటుంది. వీరి ప్రేమాయణం గురించి వార్తలు బయటికి వచ్చినప్పటి నుంచి మీడియాలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. కారణాలేంటన్నది పక్కన పెడితే ఈ జంట అందరికీ చూడముచ్చటగా అనిపించింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపించుకున్నారు అందరితోనూ. పెళ్లి జరిగినపుడు, ఆ తర్వాత చూసేవాళ్లందరికీ ఈ జంట చాలా అన్యోన్యంగా కనిపించింది. అలాంటి జంట పెళ్లయి నాలుగేళ్లు తిరక్కముందే విడాకులు తీసుకోవడం అందరికీ పెద్ద షాక్. కొంతమంది ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

సోషల్ మీడియాలో ఇటు చైతూకు, అటు సమంతకు.. మళ్లీ కలిసిపోవాలని మెసేజ్‌లు పెట్టే వాళ్లు చాలామందే ఉన్నారు. ఐతే సామాన్యులే కాదు.. మురళీ మోహన్ లాంటి సినీ లెజెండ్ సైతం తనకు కాస్త ముందుగా విడాకుల గురించి తెలిస్తే ఇద్దరితో కలిసి మాట్లాడేవాడినని వ్యాఖ్యానించడం విశేషం. చైతూ-సామ్ తన ఇంట్లోనే ఉండేవారని వెల్లడిస్తూ.. ఆ ఇంటికి సంబంధించి ఆసక్తికర విశేషాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో మాకు కొన్ని అపార్ట్‌మెంట్లున్నాయి. వాటిలో మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మూడు ఇళ్లు నిర్మించుకున్నాం. ఒకసారి చైతూ-సమంత మా అపార్ట్‌మెంట్స్ చూడడానికి వచ్చారు. మేం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న ఇళ్లలో ఒకటి వాళ్లిద్దరికీ బాగా నచ్చింది. అది తమకు కావాలని అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. దీంతో వాళ్లు కొంత నిరాశకు గురయ్యారు. కానీ కొన్ని రోజుల తర్వాత నాగార్జున నన్ను అడిగితే కాదనలేక ఆ మూడు ఇళ్లలో ఒకటి చైతన్యకు ఇచ్చాను.

పెళ్లయ్యాక చైతూ, సామ్ ఆ ఇంట్లోనే ఉన్నారు. చాలా చూడముచ్చటగా అనిపించేవారు. ఎప్పుడూ వాళ్లు గొడవపడడం చూడలేదు. తిట్టుకోవడం, వాగ్వాదాలు జరిగిన ఘటనలు కూడా ఆ ఇంట్లో జరిగేవి కావు. ఫ్రెండ్స్, వీకెండ్ పార్టీలు లాంటివేమీ ఆ ఇంట్లో ఉండేవి కాదు. ఎప్పుడూ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. మా ఇంట్లో పని చేసేవాళ్లు.. చైతూ, సామ్ విడిపోయారని, తమ సామానంతా తీసుకుని వెళ్లిపోయారని చెప్పారు. అది విని నేను షాకయ్యాను. ఒకవేళ ముందే తెలిసి ఉంటే వారితో మాట్లాడేవాడిని’’ అని మురళీ మోహన్ తెలిపారు.

This post was last modified on July 20, 2022 9:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago