ఆమిర్ ఖాన్ సినిమా అంటే ఒకప్పుడు ప్రేక్షకులు ఎగబడి థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు. భాషా భేదం కూడా ఉండేది కాదు. అతడి హిందీ చిత్రాలను సౌత్ ఆడియన్స్ బాగానే చూసేవారు. కానీ ఆమిర్ చివరి సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ డిజాస్టర్ కావడం, కొవిడ్ తర్వాత పరిస్థితులు దారుణంగా తయారవడం ఆమిర్ కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ మీద ప్రతికూల ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.
ఈ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ కావడం, ట్రైలర్ కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు లేకపోవడం కూడా మైనస్సే అయ్యాయి. దీంతో ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాపీస్ సక్సెస్ మీద సందేహాలు నెలకొన్నాయి ట్రేడ్ వర్గాల్లో. అలా అని ఆమిర్ ఆషామాషీగా తన సినిమాను రిలీజ్ చేస్తాడనుకుంటే పొరబాటే. ప్రమోషన్ల విషయంలో ఇండియన్ సినిమాకు ఒక కొత్త మార్గం చూపించిన హీరోల్లో ఒకడు ఆమిర్. స్టార్ హీరోలు కూడా దేశమంతా తిరుగుతూ ప్రమోషన్లు చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది అతనే.
అందుకే వచ్చే నెల 12న రిలీజ్ కాబోయే తన సినిమా కోసం దేశమంతా తిరిగేయడానికి నిర్ణయించుకున్నాడు ఆమిర్. తన సినిమా తెలుగు వెర్షన్ మీద కూడా అతను ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. తన చిత్రంలో కీలక పాత్ర పోషించిన చైతూ కోసమని అతడి సినిమా ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్కు ఆమిర్ రావడం అప్పట్లో ఆశ్చర్యం కలిగించింది. అలాగే ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లోనూ పాల్గొన్నాడు. అందుకు ప్రతిగా ఇప్పుడు రాజమౌళి అక్కరకు వస్తున్నాడు.
తాజాగా హైదరాబాద్లో ‘లాల్ సింగ్ చడ్డా’ తెలుగు వెర్షన్ స్పెషల్ ప్రివ్యూ వేశారు. ఇందుకు వేదికైంది మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోని హోం థియేటర్ కావడం విశేషం. దానికి రాజమౌళితో పాటు నాగార్జున, సుకుమార్, రామ్ చరణ్, నాగచైతన్య కూడా హాజరయ్యారు. వీళ్లంతా సినిమా చూస్తున్న, ఆమిర్ను అభినందిస్తున్న వీడియో కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి చిరంజీవి సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. మరి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆమిర్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత మేర ఫలిస్తుందో చూడాలి. అలాగే సౌత్ ఆడియన్స్ ఈ సినిమాను ఏమేర ఆదరిస్తారు.. మొత్తంగా ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఆసక్తికరం.
This post was last modified on July 16, 2022 9:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…