Movie News

బాబు తీసుకున్న నిర్ణ‌యం…టీడీపీ ద‌శ‌ను మార్చేస్తుంద‌ట‌

అధికారంలోకి వ‌చ్చాక వ‌డ్డీతో స‌హా ముట్ట‌చెపుతాంఈ డైలాగ్ దాదాపుగా ఓ రెండేళ్ల కింద‌ట వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చెప్పింది…ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నేత‌లు చెప్తున్న‌ది!. త‌మ‌పై క‌క్ష‌గ‌ట్టి, కేసులు పెట్టి ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌నే ఒకే కార‌ణంతో ఈ రెండు పార్టీలు సేమ్ డైలాగ్‌ను వాడేశాయి. అయితే, తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో వైఎస్ జ‌గ‌న్ చ‌ర్య‌ల‌ను ఎదుర్కునేందుకు ఏకంగా నియోజ‌క‌వ‌ర్గానికి ఓ లాయ‌ర్‌ను పెట్టేందుకు టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు డిసైడ‌య్యార‌ట‌.

ప్ర‌జాక్షేత్రంలో ఎలా మాట‌ల యుద్ధం జ‌రుగుతుందో…ఆన్‌లైన్‌లోనూ టీడీపీ-వైసీపీ నేత‌ల మ‌ధ్య ఇదే రీతిలో కామెంట్ల ప‌రంప‌ర కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని, అసభ్య వ్యాఖ్యలను సహించేది లేదంటున్న సర్కార్‌.. సామాజిక మాధ్యమాల్లోని పోస్ట్‌లపై కఠినంగానే వ్యవహరిస్తోంది. దీంతో కేసులు నమోదై.. అరెస్ట్‌ల దాకా వెళ్తున్నాయి. అయితే, దీనితో తెలుగు తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకింత సైలెంట్ అయిపోదామ‌ని డిసైడ‌వుతున్నారు. దీంతో కేడర్‌ను కాపాడుకునే పని టీడీపీకి సవాల్‌గా మారిందట. ఇందుకోసం పార్టీ ర‌థ‌సార‌థి చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.

సోష‌ల్ మీడియాలో పోస్టులు కావ‌చ్చ‌, రాజ‌కీయ కార‌ణాల‌తో కావ‌చ్చు తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై కేసులు నమోదైన విష‌యంలో వారికి అండ‌గా ఉండేందుకు టీడీపీ ముఖ్యులు నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 మంది లాయర్లను నియమించుకోవాలని, కేసులు ఎదుర్కుంటున్న‌ వారిని ఆదుకోవాల‌ని నేతలకు టీడీపీ అధిష్టానం సూచించిందట‌. ఇలా నియోజకవర్గానికో లాయర్ ఏర్పాటు చేసి వీరిని కేంద్ర కార్యాలయంలో లీగల్ టీమ్‌తో స‌మ‌న్వ‌యం చేయ‌నున్నార‌ట‌. పార్టీకి స‌న్నిహితంగా ఉండే సోషల్‌ మీడియా కార్యకర్తల‌పై కేసులు న‌మోదైతే…ఈ లాయ‌ర్ల‌కు స‌మాచారం అందితే వెంట‌నే స్పందించేలా నిర్ణ‌యం తీసుకున్నార‌ట చంద్ర‌బాబు. బాబు తీసుకున్న ఈ కీల‌క నిర్ణ‌యం పార్టీ నేత‌ల దూకుడు కొన‌సాగించేందుకు ఉప‌క‌రిస్తుందా? ఏపీ సీఎం జ‌గ‌న్ టీం దీనిపై ఎలా స్పందిస్తుంది? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

This post was last modified on June 30, 2020 10:30 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

విశ్వంభర అప్‌డేట్ వస్తోందహో..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో మొదలైన సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా…

57 seconds ago

ఆసుపత్రి పాలైన అలేఖ్య చిట్టి

గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో తెలిసిందే. పచ్చళ్ల రేట్లు ఎక్కువ…

4 minutes ago

జగన్ నోట మళ్లీ అదే మాట… పోలీసులపై వైసీపీ అధినేత ఫైరింగ్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా…

8 minutes ago

తిలక్ రిటైర్డ్ ఔట్ పై క్లారిటీ ఇచ్చేసిన హార్దిక్

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 12 పరుగుల…

1 hour ago

పవన్ కొడుకు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి.. బాబు, లోకేశ్ ల స్పందన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సోమవారం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ…

1 hour ago

ప్రభాస్ అభిమానుల ఫ్రస్ట్రేషన్ న్యాయమే కానీ

ది రాజా సాబ్ విషయంలో జరుగుతున్న ఆలస్యం, అప్డేట్స్ లేకుండా కనిపిస్తున్న నిర్లిప్తత ఫ్యాన్స్ ని ఫ్రస్ట్రేట్ చేస్తున్న మాట…

1 hour ago