టాలీవుడ్ లోనే కాదు ఏ భాషలో అయినా హీరోలకు ఎంత వయసొచ్చినా వాళ్ళ పక్కన ఆడిపాడే భామలు మాత్రం యవ్వనంలోనే ఉండాలి. లేదంటే అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఒప్పుకోరు. అందుకే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల సరసన మనవరాలి వయసున్న శ్రీదేవి డాన్స్ చేస్తే ఆహా ఓహో అంటూ మురిసిపోయారు. ఇప్పటికీ చిరు బాలయ్యలతో జట్టు కడుతోంది శృతి హాసన్ తమన్నా లాంటి యంగ్ బ్యూటీసే. ఈ మినహాయింపు హీరోయిన్లకు ఉండదు. మహా అయితే ఓ పదేళ్లు స్టార్ డం చూశాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా షిఫ్ట్ అయిపోతారు.
దీనికి ప్రభాస్ సినిమాకు సంబంధం ఏంటనేగా మీ డౌట్. అక్కడికే వద్దాం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందబోయే స్పిరిట్ లో తనకు జోడిగా కరీనా కపూర్ (బెబో) పేరు పరిశీలనలో ఉందనే వార్త ముంబై మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే కరీనా ఎప్పుడో 2000 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో ఉన్నాయి. ఆ తర్వాత అందరి లాగే అవకాశాలు తగ్గిపోయి పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి అంకితమయ్యాక సెలెక్టివ్ గా ఉంటోంది.
తన చేతిలో ఉన్న చెప్పుకోదగ్గ సినిమా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ఒక్కటే. ఇప్పుడీ స్పిరిట్ రికమండేషన్ కూడా అది పురుష్ విలన్ అలియాస్ కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ ద్వారా వచ్చి ఉండొచ్చన్న టాక్ కూడా ఉంది. మరీ ఇంత ముదురు భామనా అని కామెంట్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. స్పిరిట్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడే నిర్ధారణకు రాలేం కానీ ఇంకొంత కాలం వెయిట్ చేయాలి. సందీప్ ప్రస్తుతం రన్బీర్ కపూర్ తో యానిమల్ షూట్ లో బిజీ ఉన్నాడు. అదయ్యాకే స్పిరిట్ అప్ డేట్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు
This post was last modified on July 8, 2022 2:43 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…