ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా పుట్టిందో కానీ ఎప్పుడో వెయ్యి సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన రాజు సుహల్ దేవ్ పాత్రను తెరకెక్కించే ఉద్దేశంతో ఓ ప్రొడక్షన్ కంపెనీ రామ్ చరణ్ ను కలిసిందన్న వార్త ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఆర్ఆర్ వచ్చినప్పటి నుంచి ముంబై పత్రికల్లో వెబ్ సైట్స్ లో మెగా పవర్ స్టార్ పేరు బాగా నానుతోంది. దానికి తోడు శంకర్ తో చేస్తున్న సినిమా కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఏదో ఒక రూపంలో కవరేజ్ కంటిన్యూగా దక్కుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ట్రిపులార్ వచ్చాక ఇంకా ఎక్కువయ్యింది.
ఒకవేళ ఇది కాసేపు నిజమే అనుకుందాం. కానీ సుహల్ దేవ్ కు ఎంత అద్భుతమైన నేపథ్యం ఉన్నప్పటికీ ఆ కథను ఇప్పటి జెనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా చెప్పడం చాలా కష్టం. 1033లో ఘాజి మియన్ దండయాత్ర చేసినప్పుడు సామంత రాజులందరూ అతనికి తలొగ్గితే సుహల్ దేవ్ ఒక్కడే ఎదురొడ్డి వాళ్ళను మట్టుబెడతాడు. ఆ తర్వాత అదే మియన్ దగ్గర కమాండర్ గా పని చేసిన సయ్యద్ ఇబ్రహీం చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. ఈ క్రమంలో ఎన్నో ఉత్కంఠభరిత సంఘటనలు, ఊహకందని మలుపులు జరుగుతాయి. అవన్నీ సుహల్ గొప్పదనాన్ని చాటేవే.
అసలే చారిత్రక పురుషుల గాథల పట్ల మనమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఏమంత ఆసక్తి చూపించడం లేదు. సామ్రాట్ పృథ్విరాజ్ ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. మణికర్ణిక ఏదో పర్లేదనిపించింది కానీ అద్భుతాలు చేయలేదు. గౌతమి పుత్రశాతకర్ణి హిట్ అయినా బాలయ్య రేంజ్ లో ఆడలేదు. కమర్షియల్ అంశాలు ఎక్కువ చూపించే అవకాశం లేకుండా డ్రామాని బ్యాలన్స్ గా నడిపించే ఒత్తిడి ఉండటంతో దర్శకులు ఫాంటసీని జోడించలేక తడబడుతున్నారు. మరి చరణ్ ఇలాంటి ట్రెండ్ లో రిస్క్ చేసి ఓకే చెప్పడం అనుమానమే.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…