పార్టీలోని కోవర్టులతో తీవ్రంగా నష్టపోవటం ఖాయమని చంద్రబాబునాయుడు అన్నారు. కలికిరిలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. మొన్నటి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి రెండు కారణాలుగా తేల్చారు. మొదటిది తాను ఏమరుపాటుగా ఉండటం. రెండో కారణం పార్టీలోని కోవర్టులే దెబ్బకొట్టడమని చెప్పారు. కుప్పంలో పార్టీ ఓడిపోయిన తర్వాత తాను మేల్కొన్నట్లు చెప్పారు.
భవిష్యత్తులో అలాంటి దెబ్బ పడకూడదనే తాను కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండాలన్న కారణంతోనే సొంతిల్లు కట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో పార్టీలోని కోవర్టులను ఏరిపారేశానని కూడా అన్నారు. మరి చంద్రబాబు ఏరేసిన కోవర్టులు ఎవరో ఎవరికీ తెలీటంలేదు. ఎంతమంది కోవర్టులను గుర్తించారు, ఎంతమందిని పార్టీ నుండి పంపేశారో తెలీదు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పార్టీ విషయాలపైన, నేతలపైన శ్రద్ధ తీసుకోలేదని అంగీకరించారు.
ఇకనుండి అలాంటి ఆరోపణలు వినబడకూడదనే నేతలతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో నేతలంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరు ఐకమత్యంతో కృషి చేస్తే పార్టీ గెలుపు చాలా సులభమవుతుందన్నారు. అధికారంలోకి రాగానే పార్టీ కోసం కష్టపడిన నేతలందరికీ తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడండి తర్వాత తాను అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని హామీఇచ్చారు.
మొత్తం మీద మినీ మహానాడు కార్యక్రమం బాగానే జరిగింది. కాకపోతే తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని రెండు వర్గాలు చంద్రబాబు ఎదుటే గొడవలు పడ్డాయి. నియోజకవర్గ ఇన్చార్జి శంకర్ యాదవ్ వ్యాపారాల పేరుతో బెంగుళూరులో కాకుండా నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని గట్టిగా చెప్పారు. నియోజకవర్గం ఇన్చార్జన్నాక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ఎలాగంటు నిలదీశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కారణంగా అందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమిష్టి పోరాటాలు చేయాలని పిలుపిచ్చారు. మరి చంద్రబాబు మాట ఎంతమందికి ఎక్కుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 8, 2022 2:12 pm
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…