ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ది వారియర్ ట్రైలర్ యుట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో కళకళలాడిపోతోంది. యాక్షన్ కంటెంట్ తో మాస్ కి ఫుల్ మీల్స్ అనిపించేలా బాగానే కట్ చేశారు. టేకింగ్, విజువల్స్ ఓకే కానీ కథ పరంగా చూస్తే మాత్రం రెగ్యులర్ స్టైల్ లోనే ఉండటం అభిమానులను కొంచెం టెన్షన్ పెడుతోంది. ఓ పోలీస్ ఆఫీసర్, లోకల్ గూండా మధ్య జరిగే క్లాష్ ని దర్శకుడు లింగుస్వామి తన మార్కు టేకింగ్ తో తీసినట్టు ఉంది తప్ప ఎగ్జైట్ మెంట్ అనిపించేది అంతగా లేదనేది న్యూట్రల్ ఆడియన్స్ అభిప్రాయం.
ఏదో డాక్టర్ గెటప్ లో రామ్ కనిపించే ఒక షాట్ ని అలా చూపించి ఇలా మాయం చేశారు. ఇదేమైనా ట్విస్టా లేక పోలీసే ఏదో కారణంతో ఆ డ్రెస్సు వేశాడా అనేది చూడాల్సి ఉంది. ది వారియర్ కి మంచి బిజినెస్ జరుగుతోంది. రెడ్ ఫలితం ఎలా ఉన్నా ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో ట్రేడ్ దీని మీద నమ్మకం పెట్టుకుంది. లింగుస్వామి భారీ అంచనాలు అందుకోవాల్సి ఉంది. కొండారెడ్డి బురుజు దాని చుట్టూ రౌడీయిజంతో ఒక్కడు నుంచి సరిలేరు నీకెవ్వరు దాకా చాలా సినిమాలు వచ్చాయి. వారియర్ ఏం స్పెషలో చూడాలి.
అందుకే ఆది పినిశెట్టికి ఫ్యాక్షన్ బట్టలు వేయకుండా నల్ల దుస్తులతో కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కృతి శెట్టి పాత్ర ఇవన్నీ రొటీన్ టెంప్లేట్ లోనే కనిపిస్తున్నాయి. అయితే క్రాక్ తరహాలో ఏదైనా షాకింగ్ ట్విస్టు, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటే మాత్రం ది వారియర్ కు పండగే. అసలే విక్రమ్ తర్వాత బాక్సాఫీస్ డల్ గా ఉంది. పక్కా కమర్షియల్ కూడా తేలిపోయింది. హ్యాపీ బర్త్ డే బాగున్నా బిసి సెంటర్స్ లో చేసే మేజిక్ అంతగా ఉండకపోవచ్చు. సో రామ్ కు మంచి స్లాట్ తో పాటు ఓపెన్ గ్రౌండ్ దొరుకుతోంది. పైగా చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేదు. బాగుందనే మాట వస్తే చాలు థియేటర్లకు జనం వస్తారు. మరి ఈ సీమ మసాలా వర్కౌట్ అయ్యేనా.
This post was last modified on July 2, 2022 4:33 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…