సినీ వినోదం కరవైపోతోందని డీలా పడిపోయిన సినీ ప్రియులకు శుభ వార్త. ఏవో చిన్నా చితకా సినిమాలు ఓటిటీలో రావడం కాదు. ఏకంగా భారీ సినిమాలే కట్ట కట్టుకుని మీ టీవీలోకి వచ్చేస్తున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయని ఆశగా ఎదురు చూసిన బాలీవుడ్ నిర్మాతలు ఇక లాభం లేదని డిసైడ్ అయిపోయారు.
అక్షయ్ కుమార్ ‘లక్ష్మి బాంబ్’, అజయ్ దేవగన్ నటించిన ‘భుజ్’ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్నాయి. అంతే కాదు హాట్ స్టార్ మరో మూడు క్రేజీ సినిమాలు కూడా కొనేసింది. వరుణ్ ధావన్ నటిస్తున్న కూలీ నెంబర్ 1రీమేక్, అలియా భట్ సినిమా సడక్ 2 కూడా ఇందులోనే విడుదల కానున్నాయి. అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్ బుల్ చిత్రం కూడా హాట్ స్టార్ లో దర్శనం ఇవ్వనుంది.
ఈ సినిమాలన్నీ హాట్ స్టార్ లో వస్తున్నాయని సోమవారం ఆ చిత్ర కథానాయకులు, కథానాయికలు కలిసి ప్రకటించనున్నారు. ఈ దెబ్బతో ఇండియాలో ఓటిటీ గేమ్ వేడెక్కబోతోంది. ఇంతకాలం మీన మేషాలు లెక్క పెట్టిన తెలుగు నిర్మాతలు కూడా ఇక ముందుకి కదిలే సమయం ఆసన్నమయింది.
This post was last modified on June 29, 2020 7:24 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…