తెలుగు సినిమాల్లో సత్తా చాటుకుని బాలీవుడ్కు వెళ్లిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ నుంచి సందీప్ రెడ్డి వరకు బాలీవుడ్కు వెళ్లి అక్కడా హిట్లు కొట్టారు. ఈ జాబితాలో మరో దర్శకుడు చేరబోతున్నాడు. అతనే.. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి. తొలి సినిమాతోనే అతడి సత్తా ఏంటో దేశమంతా తెలిసింది. ‘ఘాజీ’ హిందీలోనూ చాలా బాగా ఆడింది. ఐతే రెండో సినిమా ‘అంతరిక్షం’తో సంకల్ప్ అంచనాల్ని అందుకోలేకపోయాడు.
మంచి ప్రయత్నమే చేసినా అది కమర్షియల్గా వర్కవుట్ కాలేదు. దీని తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకుని ‘లస్ట్ స్టోరీ’ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్లో ఓ పోర్షన్ను డైరెక్ట్ చేశాడు సంకల్ప్. లాక్ డౌన్ లేకుంటే ఈ పాటికి నెట్ ఫ్లిక్స్లో ఈ సిరీస్ ప్రసారం కూడా అయ్యేదేమో. త్వరలోనే దీని స్ట్రీమింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
దీని తర్వాత సంకల్ప్ ఏం సినిమా చేస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. అతను బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తాజా సమాచారం. ‘కమాండో’ ఫేమ్ విద్యుత్ జమాల్ హీరోగా సంకల్ప్ ఓ హిందీ సినిమా తీయబోతున్నాడట. ఇది ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగుతుందట. సంకల్ప్ స్టయిల్లోనే ప్రయోగాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. సైన్స్ నేపథ్యంలో సినిమాలు తీయడం సంకల్ప్కు బాగా ఇష్టం. ఆ జానర్ మీద మంచి పట్టుంది.
సంకల్ప్ కొత్త చిత్రంలోనే సైన్స్ సంబంధిత అంశాలు ప్రధానంగా ఉంటాయట. తెలుగులో విలన్గా విద్యుత్ అనేక సినిమాలు చేశాడు. హిందీలో ‘కమాండో’ సిరీస్ సహా హీరోగా నటించిన కొన్ని సినిమాలు బాగానే ఆడాయి. గత ఏడాది ‘కమాండో-3’తో పలకరించాడు విద్యుత్. దాని తర్వాత అతను నటించిన ‘ఖుదా హాఫిజ్’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సంకల్ప్-విద్యుత్ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కే అవకాశముంది.
This post was last modified on June 28, 2020 2:28 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…