మాములుగా కోలీవుడ్ లో అతి పెద్ద మార్కెట్ ఉన్న హీరోలు ఎవరంటే మొదట వినిపించే పేర్లు రెండు. ఒకటి అజిత్ తర్వాత విజయ్. రజనీకాంత్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు కానీ యూత్ ఫాలోయింగ్ విషయంలో ఆయనా ఈ మధ్య కొంత వెనుకబడి ఉన్నారు. అందుకే రికార్డులు ఏవైనా సరే ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యమని తమిళనాడు మీడియా ప్రస్తావిస్తూనే ఉంటుంది. అసలు కమల్ హాసన్ ఈ లిస్టులో ఎప్పటి నుంచో లేరు. కారణం ఏళ్ళ తరబడి సరైన హిట్ లేక ఆయన్ను వెంటాడుతూ వచ్చిన ఫ్లాపులు డిజాస్టర్లు.
ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. విక్రమ్ వసూళ్లు అక్కడి ట్రేడ్ పండితుల మతులు పోగొడుతున్నాయి. ఇప్పటిదాకా చెక్కుచెదరకుండా ఉన్న బాహుబలి 2 రికార్డుని విక్రమ్ దాటేయడం చూసి వాళ్లకు నోట మాట రావడం లేదు.
దాని ఫుల్ రన్ షేర్ 150 కోట్లని కేవలం మూడో వారం అడుగుపెట్టే లోపలే విక్రమ్ లేపేయడం చూసి వామ్మో అంటున్నారు. బాహుబలి 2 వచ్చి ఐదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఏ తమిళ మూవీ దాన్ని దాటలేకపోయింది. ఎవరి వల్లా కాలేదు. లోకనాయకుడికి సరైన సబ్జెక్టు పడితే బాక్సాఫీస్ విశ్వరూపం ఏ స్థాయిలో ఉంటుందో ఇతర హీరోల అభిమానులు కళ్లారా చూస్తూ వాహ్ కమల్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇంకా ఫైనల్ రన్ చాలా దూరంలో ఉంది. తెలుగులో కొంత స్లో అయ్యింది కానీ కేరళలోనూ విక్రమ్ ప్రభంజనం జోరుగా ఉంది. దీని దెబ్బకే అరుణ్ విజయ్ లాంటి మీడియం రేంజ్ హీరో తమ సినిమాల రిలీజ్ ని వాయిదా వేసుకున్నారు. ధైర్యం చేసి వచ్చినవి కమల్ తాకిడిని తట్టుకోలేక అత్తెసరు వసూళ్లతో సర్దుకుంటున్నాయి.
ఇలాంటి విజయాలు కెరీర్ లో ఎన్నో చూసిన కమల్ ఎప్పుడూ లేనంత ఆనందంగా విక్రమ్ విషయంలో ఉన్నారు. ఆ సంతోషం తాలూకు కనిపించని తడిని ఆయన కళ్ళలో చూడొచ్చు. కెరీర్ అయిపోతోంది ఇంకెవరు తనని చూడరేమోననే అనుమానాలు లోకేష్ కనగరాజ్ అనే యువకుడు బద్దలుకొట్టడం అంటే మాటలా
This post was last modified on June 19, 2022 11:37 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…