ఆర్ఆర్ఆర్ వంద రోజులకు దగ్గరవుతోంది. థియేట్రికల్ రన్ పూర్తయిపోయింది. నెట్ ఫ్లిక్స్ పుణ్యమాని దేశవిదేశీయుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. కాస్త బ్రేక్ దొరికితే ఔటింగ్ వెళ్లి తన పదో వివాహ వార్షికోత్సవం చేసుకుని వచ్చేశాడు. ఇది కాగానే గౌతమ్ తిన్ననూరి ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ ఉంటాడు. ఆపై లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. ఎటొచ్చి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ స్థాయి స్పీడ్ లో లేడనే అసహనం అభిమానుల్లో పెరిగిపోతోంది.
ఇంతకీ కొరటాల శివ ఫైనల్ వెర్షన్ ని లాక్ చేశారో లేదో తెలియదు. మరోవైపు ఆచార్య నష్టాల పంచాయితీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని అందుకే ఆ టెన్షన్లన్నీ అయ్యాకే సినిమా మొదలుపెట్టాలని శివ తారక్ లు నిర్ణయించుకున్నారట. దానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అంతు చిక్కడం లేదని ఫ్యాన్స్ ఫిర్యాదు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ ని వేగంగా పూడ్చే విధంగా త్వరగా సినిమాలు చేయాలని వాళ్ళ డిమాండ్. కానీ యంగ్ టైగర్ కు పరిస్థితులు అనుకూలించక ఆలస్యం తప్పడం లేదు.
ఓటిటిలో ఆర్ఆర్ఆర్ వచ్చాక దాన్ని చూసిన ఫారినర్స్ అధిక శాతం క్రెడిట్ ని చరణ్ కి ఇవ్వడం గాయం మీద కారం చల్లినట్టు అవుతోంది. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ రిలీజ్ టైం నుంచే ఆ ఫీలింగ్ వాళ్లలో ఉంది. కెజిఎఫ్ దర్శకుడితో జూనియర్ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక వాళ్ళ నిరుత్సాహం తగ్గింది కానీ ఇకపై క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తే తప్ప శాంతించేలా లేరు. కొరటాల ఎప్పుడు మొదలుపెట్టినా 2023లోనే రిలీజ్ ఉంటుంది. నీల్ ది 2024లో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఆపై నెక్స్ట్ ఎవరో ..
This post was last modified on June 18, 2022 10:17 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…