ఆర్ఆర్ఆర్ వంద రోజులకు దగ్గరవుతోంది. థియేట్రికల్ రన్ పూర్తయిపోయింది. నెట్ ఫ్లిక్స్ పుణ్యమాని దేశవిదేశీయుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. కాస్త బ్రేక్ దొరికితే ఔటింగ్ వెళ్లి తన పదో వివాహ వార్షికోత్సవం చేసుకుని వచ్చేశాడు. ఇది కాగానే గౌతమ్ తిన్ననూరి ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ ఉంటాడు. ఆపై లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. ఎటొచ్చి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ స్థాయి స్పీడ్ లో లేడనే అసహనం అభిమానుల్లో పెరిగిపోతోంది.
ఇంతకీ కొరటాల శివ ఫైనల్ వెర్షన్ ని లాక్ చేశారో లేదో తెలియదు. మరోవైపు ఆచార్య నష్టాల పంచాయితీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని అందుకే ఆ టెన్షన్లన్నీ అయ్యాకే సినిమా మొదలుపెట్టాలని శివ తారక్ లు నిర్ణయించుకున్నారట. దానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అంతు చిక్కడం లేదని ఫ్యాన్స్ ఫిర్యాదు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ ని వేగంగా పూడ్చే విధంగా త్వరగా సినిమాలు చేయాలని వాళ్ళ డిమాండ్. కానీ యంగ్ టైగర్ కు పరిస్థితులు అనుకూలించక ఆలస్యం తప్పడం లేదు.
ఓటిటిలో ఆర్ఆర్ఆర్ వచ్చాక దాన్ని చూసిన ఫారినర్స్ అధిక శాతం క్రెడిట్ ని చరణ్ కి ఇవ్వడం గాయం మీద కారం చల్లినట్టు అవుతోంది. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ రిలీజ్ టైం నుంచే ఆ ఫీలింగ్ వాళ్లలో ఉంది. కెజిఎఫ్ దర్శకుడితో జూనియర్ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక వాళ్ళ నిరుత్సాహం తగ్గింది కానీ ఇకపై క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తే తప్ప శాంతించేలా లేరు. కొరటాల ఎప్పుడు మొదలుపెట్టినా 2023లోనే రిలీజ్ ఉంటుంది. నీల్ ది 2024లో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఆపై నెక్స్ట్ ఎవరో ..
This post was last modified on June 18, 2022 10:17 pm
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…
ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…
ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. వైసీపీ వర్సెస్ బీజేపీ కార్యకర్త ల మధ్య…