ఆర్ఆర్ఆర్ వంద రోజులకు దగ్గరవుతోంది. థియేట్రికల్ రన్ పూర్తయిపోయింది. నెట్ ఫ్లిక్స్ పుణ్యమాని దేశవిదేశీయుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. కాస్త బ్రేక్ దొరికితే ఔటింగ్ వెళ్లి తన పదో వివాహ వార్షికోత్సవం చేసుకుని వచ్చేశాడు. ఇది కాగానే గౌతమ్ తిన్ననూరి ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ ఉంటాడు. ఆపై లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. ఎటొచ్చి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ స్థాయి స్పీడ్ లో లేడనే అసహనం అభిమానుల్లో పెరిగిపోతోంది.
ఇంతకీ కొరటాల శివ ఫైనల్ వెర్షన్ ని లాక్ చేశారో లేదో తెలియదు. మరోవైపు ఆచార్య నష్టాల పంచాయితీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని అందుకే ఆ టెన్షన్లన్నీ అయ్యాకే సినిమా మొదలుపెట్టాలని శివ తారక్ లు నిర్ణయించుకున్నారట. దానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అంతు చిక్కడం లేదని ఫ్యాన్స్ ఫిర్యాదు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ ని వేగంగా పూడ్చే విధంగా త్వరగా సినిమాలు చేయాలని వాళ్ళ డిమాండ్. కానీ యంగ్ టైగర్ కు పరిస్థితులు అనుకూలించక ఆలస్యం తప్పడం లేదు.
ఓటిటిలో ఆర్ఆర్ఆర్ వచ్చాక దాన్ని చూసిన ఫారినర్స్ అధిక శాతం క్రెడిట్ ని చరణ్ కి ఇవ్వడం గాయం మీద కారం చల్లినట్టు అవుతోంది. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ రిలీజ్ టైం నుంచే ఆ ఫీలింగ్ వాళ్లలో ఉంది. కెజిఎఫ్ దర్శకుడితో జూనియర్ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక వాళ్ళ నిరుత్సాహం తగ్గింది కానీ ఇకపై క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తే తప్ప శాంతించేలా లేరు. కొరటాల ఎప్పుడు మొదలుపెట్టినా 2023లోనే రిలీజ్ ఉంటుంది. నీల్ ది 2024లో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఆపై నెక్స్ట్ ఎవరో ..
This post was last modified on June 18, 2022 10:17 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…