ఆచార్య డిజాస్టర్ తర్వాత విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా గాడ్ ఫాదర్. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని ఆగస్ట్ లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని ఒక ప్రచారం జరిగింది కానీ ఇప్పుడా అవకాశం లేదని తేలిపోయింది. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షో మెగా ఫినాలేకి ముఖ్య అతిధిగా వచ్చిన చిరంజీవి, అక్కడే జడ్డ్ గా ఉన్న సంగీత దర్శకుడు తమన్ లు ఇన్ డైరెక్ట్ గా దీనికి సంబంధించిన కొన్ని కీలకమైన క్లూలు ఇచ్చేశారు
అందులో మొదటిది యాంకర్ శ్రీరామ్ కు చిరు మూవీలో పాడే అవకాశం. ఆది కూడా గాడ్ ఫాదర్ లోనే. టైటిల్ కోసం పోటీ పడుతున్న ఒక లేడీ సింగర్ కు సైతం అందులోనే అప్పటికప్పుడు ఓపెన్ ఆఫర్ ఇప్పించేశారు. చిరంజీవి నయనతార ఇందులో అన్నాచెల్లెలుగా నటిస్తున్నారని వీళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సాంగ్ ని ఆ అమ్మాయితో పాడిస్తామని తమన్ తో చెప్పించేశారు మెగాస్టార్. అంటే సాంగ్ రికార్డింగ్ జరగలేదన్న మాట. దాని తాలూకు షూట్ పెండింగ్ ఉంది. సో నయన్ వచ్చేదాకా బ్రేక్ పడినట్టే.
సాధారణ ప్రేక్షకుల్లో చాలా మంది లూసిఫర్ చూడలేదు. దీంతో చిరు నయన్ పాత్రల గురించి అవగాహన లేదు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న బంధం ఏంటో ఓపెన్ గా చెప్పేశారు కాబట్టి డౌట్ తీరిపోయింది. ఒరిజినల్ వెర్షన్ లో ఈ క్యారెక్టర్ మంజు వారియర్ పోషించారు. సత్యదేవ్ నయనతార భర్తగా నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారు. దీన్ని అక్కడ చేసింది వివేక్ ఒబెరాయ్. సో గాడ్ ఫాదర్ వర్క్ చాలా బ్యాలన్స్ ఉంది. అసలైన చిరు సల్మాన్ ఖాన్ కాంబో సాంగ్ కూడా ఇంకా పిక్చరైజ్ చేయలేదు. సో దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on June 18, 2022 9:47 am
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…
సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…
తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి…