ఆచార్య డిజాస్టర్ తర్వాత విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా గాడ్ ఫాదర్. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని ఆగస్ట్ లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని ఒక ప్రచారం జరిగింది కానీ ఇప్పుడా అవకాశం లేదని తేలిపోయింది. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షో మెగా ఫినాలేకి ముఖ్య అతిధిగా వచ్చిన చిరంజీవి, అక్కడే జడ్డ్ గా ఉన్న సంగీత దర్శకుడు తమన్ లు ఇన్ డైరెక్ట్ గా దీనికి సంబంధించిన కొన్ని కీలకమైన క్లూలు ఇచ్చేశారు
అందులో మొదటిది యాంకర్ శ్రీరామ్ కు చిరు మూవీలో పాడే అవకాశం. ఆది కూడా గాడ్ ఫాదర్ లోనే. టైటిల్ కోసం పోటీ పడుతున్న ఒక లేడీ సింగర్ కు సైతం అందులోనే అప్పటికప్పుడు ఓపెన్ ఆఫర్ ఇప్పించేశారు. చిరంజీవి నయనతార ఇందులో అన్నాచెల్లెలుగా నటిస్తున్నారని వీళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సాంగ్ ని ఆ అమ్మాయితో పాడిస్తామని తమన్ తో చెప్పించేశారు మెగాస్టార్. అంటే సాంగ్ రికార్డింగ్ జరగలేదన్న మాట. దాని తాలూకు షూట్ పెండింగ్ ఉంది. సో నయన్ వచ్చేదాకా బ్రేక్ పడినట్టే.
సాధారణ ప్రేక్షకుల్లో చాలా మంది లూసిఫర్ చూడలేదు. దీంతో చిరు నయన్ పాత్రల గురించి అవగాహన లేదు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న బంధం ఏంటో ఓపెన్ గా చెప్పేశారు కాబట్టి డౌట్ తీరిపోయింది. ఒరిజినల్ వెర్షన్ లో ఈ క్యారెక్టర్ మంజు వారియర్ పోషించారు. సత్యదేవ్ నయనతార భర్తగా నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారు. దీన్ని అక్కడ చేసింది వివేక్ ఒబెరాయ్. సో గాడ్ ఫాదర్ వర్క్ చాలా బ్యాలన్స్ ఉంది. అసలైన చిరు సల్మాన్ ఖాన్ కాంబో సాంగ్ కూడా ఇంకా పిక్చరైజ్ చేయలేదు. సో దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on June 18, 2022 9:47 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…