అర్జున్ కపూర్-మలైకా అరోరా.. బాలీవుడ్లో ఇదో విచిత్రమైన ప్రేమ జంట. అర్జున్ వయసు 34 ఏళ్లు కాగా మలైకా వయసు 46 ఏళ్లు. తమ కంటే ఎక్కువ వయసున్న వారితో అబ్బాయిలు ప్రేమలో పడొచ్చు కానీ.. ఇక్కడ అంతరం మరీ 12 ఏళ్లుండటం.. మలైకాకు అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉండటంతో వీరి మధ్య ప్రేమేంటో చాలామందికి అంతు బట్టలేదు.
ఇంతకుముందు మలైకాతో బంధాన్ని దాచి పెట్టాలని చూసిన అర్జున్, మలైకా.. ఈ మధ్య మాత్రం ఓపెన్ అయిపోతున్నారు. కొన్ని రోజుల కిందటే ఓ ఇంటర్వ్యూలో మలైకాను తాను అంతగా ఇష్టపడటానికి కారణమేంటో వివరించాడు. మలైకాకు ఓపిక చాలా ఎక్కువ అని.. తన పట్ల ఆమె చాలా ఓపికతో వ్యవహరిస్తూ చక్కగా మేనేజ్ చేస్తుందని అర్జున్ తెలిపాడు.
ఇప్పుడు మలైకా శుక్రవారం అర్జున్ కపూర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ స్పెషల్ మెసేజ్తో అతడిని విష్ చేసింది. అర్జున్పై తన ప్రేమను చాటుకుంది. అర్జున్ కపూర్ క్యూట్ ఫొటో ఒకటి పెట్టి.. హ్యాపీ బర్త్ డే మై సన్షైన్ అనే వ్యాఖ్య జోడించింది మలైకా.
దీంతో పాటు అర్జున్తో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంయుక్త అనే మరో అమ్మాయితో అతను కలిసున్న ఫొటోను కూడా మలైకా షేర్ చేసింది. అర్జున్కు ఎంతోమంది పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు కానీ.. మలైకాతో అతడి బంధం దృష్ట్యా ఆమె ఎలా విష్ చేస్తుందా అని అంతా ఎదురు చూశారు. అర్జున్తో తన సన్షైన్గా పేర్కొనడం ద్వారా.. ఇప్పుడు అతనే తన జీవితానికి వెలుగు అని చెప్పకనే చెప్పింది మలైకా.
మలైకా.. సల్మాన్ సోదరుడు అర్బాజ్ను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. వీళ్లిద్దరూ నాలుగేళ్ల కిందట విడిపోయారు. ఆ తర్వాతి నుంచి ఆమె అర్జున్తోనే సహజీవనం చేస్తోంది.
This post was last modified on June 27, 2020 2:32 pm
"తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం." ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి…
నిన్న రాత్రి నుంచి ఏపీ తెలంగాణలో అఖండ 2 తాండవం థియేటర్లు జనాలతో నిండుగా కళకళలాడుతున్నాయి. సినిమా ఎలా ఉంది,…
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నారు. వరుసగా పెట్టే వాట్సాప్ స్టేటస్లు, స్థానిక నేతలపై తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో…
విశాఖపట్నం ఐటీ మ్యాప్పై మరింత బలంగా నిలవడానికి మరో భారీ అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లోని మహతి…
వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం…
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు.…