బాహుబలి 2 తర్వాత రానాతో గుణశేఖర్ ‘హిరణ్య కశ్యప’ అనే ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు. దాదాపు ౩౦౦ కోట్ల బడ్జెట్ అనుకోని ప్రీ ప్రొడక్షన్ కోసం మొదలు పెట్టాడు గుణ శేఖర్. మూడేళ్ళ పాటు ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిపారు. కానీ ఉన్నపళంగా ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి సమంతతో ‘శాకుంతలం’ సినిమా స్టార్ట్ చేశాడు గుణ శేఖర్. దీంతో ఇక రానాతో గుణ శేఖర్ భారీ ప్రాజెక్ట్ ఉండదని టాక్ వచ్చేసింది. ఆ వార్తలపై రానా కానీ గుణశేఖర్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక తాజాగా విరాటపర్వం ప్రమోషన్స్ లో భాగంగా రానా కి ఆ సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి వెంటనే రానా రెస్పాండ్ అయ్యాడు. హిరణ్య కశ్యప సినిమా ఉంటుందని వచ్చే ఏదాది మార్చ్ లో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని దానికోసం బాగా బడీ బిల్డ్ చేయాల్సి ఉందని చెప్పుకున్నాడు. ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్న గుణశేఖర్ త్వరలోనే రానా ‘హిరణ్య’ కు సంబందించి ఫైనల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నాడు.
అలాగే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తేజ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా గురించి కూడా రానా మాట్లాడాడు. ఆ సినిమా షూటింగ్ కొన్ని రోజుల మినహా పూర్తయిందని ఇంత వరకూ తను రష్ కూడా చూడలేదని చెప్పాడు. ఇక బాబాయ్ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ గా రానుందని తెలిపాడు. నెక్స్ట్ సినిమా ఏంటనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకున్నాడు. విరాటపర్వంతో జూన్ 17న థియేటర్స్ లోకి రాబోతున్నాడు రానా. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
This post was last modified on June 11, 2022 9:39 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…