లోకనాయకుడు కమల్ హాసన్ తన కెరీర్లో ఊహించని విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కెరీర్లో ఈ దశలో ఆయన ‘విక్రమ్’ లాంటి బ్లాక్బస్టర్ కొడతారని ఎవ్వరూ ఊహించలేదు. అసలు కమల్ కెరీర్ ఆల్రెడీ ముగిసిందనే అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు కూడా. కొన్నేళ్ల పాటు సినిమాలే చేయక.. గ్యాప్ తర్వాత చేసిన ‘ఇండియన్-2’ మధ్యలోనే ఆగిపోయాక ఆయన మీద పూర్తిగా ఆశలు వదులుకున్నారు. కానీ కమల్.. ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్తో జట్టు కట్టి ‘విక్రమ్’ లాంటి బ్లాక్బస్టర్తో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమా ఆయన కెరీర్కు ఎక్కడలేని ఊపునిచ్చింది. ఈ ఊపులో కమల్ తన పెండింగ్ ప్రాజెక్టులను బయటికి తీసే ప్రయత్నంలో పడ్డాడు. ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయిన ‘ఇండియన్-2’ను తిరిగి పట్టాలెక్కించడానికి కమల్ చూస్తున్నాడు. నిర్మాతలైన లైకా ప్రొడక్షన్ అధినేతలు, దర్శకుడైన శంకర్లతో సంధి కుదిర్చి ఈ ఏడాదే ఈ సినిమాను పున:ప్రారంభించాలని కమల్ ఫిక్సయ్యాడు.
దీంతో పాటుగా మరో పెండింగ్ ప్రాజెక్టును కూడా కమల్ తిరిగి మొదలుపెట్టనున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఆ చిత్రమే.. శభాష్ నాయుుడు. ‘దశావతారం’ చిత్రంలో పోలీస్ అధికారిగా శభాష్ నాయుడు చేసిన సందడి గురించి తెలిసిందే. ఆ సినిమాలో కమల్ పది పాత్రలు చేస్తే అన్నింట్లోకి అదే హైలైట్ అయింది. ఈ పాత్రనే లీడ్గా మార్చి ‘శభాష్ నాయుడు’ పేరుతో సినిమా తీయాలని కమల్ సంకల్పించాడు అప్పట్లో. శ్రుతి హాసన్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లారు. యుఎస్లో ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది.
కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో ఈ సినిమా అర్ధంతరంగా ఆగిపోయింది. మళ్లీ దాని ఊసే లేదు. కమల్ ఇలా మధ్యలో వదిలేసిన సినిమాల జాబితా పెద్దదే. మరుదనాయగం, మర్మయోగి.. ఇలా మెగా ప్రాజెక్టులు కొన్ని బడ్జెట్, ఇతర సమస్యలతో ముందుకు కదల్లేదు. ఐతే మిగతా సినిమాల సంగతేమో కానీ.. శభాష్ నాయుడును మాత్రం కమల్ పున:ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దీని బడ్జెట్ తక్కువే కావడం, స్క్రిప్టు సిద్ధంగా ఉండడంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించి, పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలని కమల్ భావిస్తున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.
This post was last modified on June 9, 2022 5:58 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…