లోకనాయకుడు కమల్ హాసన్ మీద తెలుగు ప్రేక్షకుల అభిమానం ప్రత్యేకమైంది. ఆయన్ని ఆదరించినట్లుగా మరే పర భాషా నటుడినీ మన వాళ్లు ఆదరించలేదు అంటే అతిశయోక్తి కాదు. భాషా సినిమా తర్వాత రజినీకాంత్కు తెలుగులో మాస్ ఫాలోయింగ్ పెరిగి ఆయన డబ్బింగ్ సినిమాలను గొప్పగా ఆదరించిన మాట వాస్తవమే కానీ.. ఆయన కంటే ముందు నేరుగా తెలుగులో మరో చరిత్ర, ఆకలి రాజ్యం, సాగర సంగమం, శుభసంకల్పం లాంటి ఆల్ టైం క్లాసిక్స్తో ఇక్కడి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ఘనత కమల్ సొంతం.
అందుకే తెలుగు ప్రేక్షకుల గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ అవుతుంటారు కమల్. తన గురువు బాలచందర్తో సమానంగా మన దర్శక దిగ్గజం విశ్వనాథ్ను గౌరవించే ఆయన.. తెలుగు ప్రేక్షకుల అభిరుచి గురించి సందర్భం వచ్చినపుడల్లా ప్రస్తావిస్తూనే ఉంటారు. తెలుగు భాష మీద, సాహిత్యం మీద ప్రేమతో శ్రీశ్రీ కవితల్ని కంఠతా నేర్చుకున్న గొప్పదనం కమల్ది.
ఈ మధ్య కూడా ఓ తమిళ మ్యూజిక్ షోలో ఆయన శ్రీశ్రీ కవితల్ని వల్లె వేశారు. చాన్నాళ్ల తర్వాత ఆయన కొత్త సినిమా ‘విక్రమ్’ తెలుగులో పెద్ద ఎత్తున విడుదలైంది. అద్భుత స్పందన తెచ్చుకుంటోంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే కనిపించింది కానీ.. రిలీజ్ తర్వాత కథ మారిపోయింది. వసూళ్లు గొప్పగా పుంజుకున్నాయి. వీకెండ్లో హౌస్ఫుల్స్తో రన్ అయింది. వీకెండ్ తర్వాత కూడా సత్తా చాటుతోంది. ముందు ‘మేజర్’తో పోటీ అంటే కష్టమే అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆ సినిమాకు దీటుగా, దాన్ని మించి తెలుగు రాష్ట్రాల్లో షేర్ రాబడుతోంది విక్రమ్. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కమల్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని కొనియాడారు. తనకు వాళ్లు ఎలాంటి విజయాలందించారో గుర్తు చేశారు. మంచి సినిమా తీస్తే వాళ్ల ఆదరణ మామూలుగా ఉండదన్నాడు.
ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన సుదాకర్ రెడ్డి సక్సెస్ గురించి మాట్లాడితే.. తాను మాత్రం మనం హిస్టరీ క్రియేట్ చేద్దాం అన్నానని.. హిస్టరీ అనే మాట చాలా పెద్దదని, అంత పెద్ద మాటను వాడే ధైర్యం తనకు తెలుగు ప్రేక్షకులే ఇచ్చారని.. అందుకే వారి అభిరుచి మీద నమ్మకంతో ఆ మాట అనగలిగానని.. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయి మళ్లీ తనను తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకొస్తుందని ధీమాగా చెప్పారు కమల్. ఆ రోజు ఆయన అన్నట్లే ఇప్పుడీ సినిమా తెలుగులో బ్లాక్బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. దీంతో కమల్ చెప్పి మరీ కొట్టాడంటూ ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.
This post was last modified on June 9, 2022 1:21 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…