ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లలో ఫేవరెట్ ఎవరో మన స్టార్లు చెప్పుకునేవాళ్లు. అక్కడి స్టార్లు మన వాళ్లు గురించి మాట్లాడ్డం అరుదుగా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్ సినిమాలు సౌత్లో ఆడడం సంగతలా ఉంచితే.. వాళ్ల మార్కెట్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. అదే సమయంలో సౌత్ సినిమాలు నార్త్ మార్కెట్ను కొల్లగొట్టేస్తున్నాయి. మన స్టార్లు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇక్కడ తమ ఫేవరెట్ హీరోల గురించి బాలీవుడ్ స్టార్లు మాట్లాడే పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన రణబీర్ కపూర్ సైతం ఇప్పుడు మన స్టార్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న తన కొత్త చిత్రం బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో భాగంగా సోమవారం విశాఖపట్నానికి వచ్చాడు రణబీర్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడున్నపుడు.. టాలీవుడ్లో మీ ఫేవరెట్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది రణబీర్కు.
దీనికి సమాధానం ఇస్తూ.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలాంటి స్టార్లందరూ తనకు ఇష్టమని.. చిరంజీవి, కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి సౌత్ స్టార్లు తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పాడు రణబీర్. అంతే కాక పవన్ కళ్యాణ్లోని స్వాగ్ తనకు ఇష్టమని అన్నాడు. ఇక తెలుగులో ఫేవరెట్గా ఒకే ఒక్క హీరోను ఎంచుకోమంటే ప్రభాస్ పేరు చెబుతానని అన్నాడు రణబీర్.
బ్రహ్మాస్త్రతో సౌత్లో బలమైన ముద్ర వేయాలనే ఆశతో ఉన్నాడు ఈ చాక్లెట్ బాయ్. కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ చిత్రంలో ఆలియా భట్ కథానాయికగా నటించింది. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. సెప్టెంబరు 9న బ్రహ్మాస్త్ర పార్ట్-1 రిలీజ్ కానుండగా.. ఈ నెల 15న ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు.
This post was last modified on May 31, 2022 10:49 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…