ఈ శుక్రవారం విడుదల కాబోతున్న విక్రమ్ మీద తమిళనాడులో భారీ అంచనాలున్నాయి కానీ తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ బజ్ కనిపించడం లేదు. ఖైదీ లాగా టాక్ వస్తే తప్ప గట్టి పికప్ ఆశించలేం. కమల్ హాసన్ సినిమానే అయినప్పటికీ ఇక్కడాయనకు ఒకప్పటి మార్కెట్ లేదు. గత పదిహేనేళ్లు చూసుకుంటే దశావతారం, విశ్వరూపం 1లు మాత్రమే అంతోఇంతో కమర్షియల్ గా వర్కౌట్ చేసుకున్నాయి.
ఉత్తమవిలన్, విశ్వరూపం 2, చీకటి రాజ్యం తలుచుకోలేనంత దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అందుకే విక్రమ్ కోసం ప్రమోషన్ విషయంలో లోకనాయకుడే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రేపు హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. దీనికో కారణం ఉంది.
2009లో కమల్ నటించిన స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ ఈనాడులో ఆయనతో వెంకీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా ఒరిజినల్ వెర్షన్ లో అనుపమ్ ఖేర్ చేసిన క్యారెక్టర్ కు ఎస్ చెప్పారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆడలేదు కానీ వీళ్ళ స్నేహం అలాగే కొనసాగింది.
ఇప్పుడా ఈనాడు బంధంతోనే వెంకటేష్ రాబోతున్నారు. అలా అని ఈ రిలేషన్ షిప్ ఇక్కడికే పరిమితమని చెప్పలేం. కమల హాసన్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా చెప్పుకునే ఇంద్రుడు చంద్రుడు రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. అప్పటి నుంచే ఈ కుటుంబంతో స్నేహం కొనసాగుతోంది. ఎఫ్3 హిట్ తో మంచి జోష్ మీదున్న వెంకీ ఇప్పుడీ విక్రమ్ కు గెస్ట్ గా రావడం హెల్ప్ అయ్యేదే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ లు ఇతర తారాగణం
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని కేసు బ్లాక్ బక్ పౌచింగ్. 1998లో హం సాత్ సాత్ హై షూటింగ్…