వినడానికి ఏమాత్రం నమ్మశక్యంగా లేకపోవచ్చు. కొందరికి కామెడీగా కూడా అనిపింవచ్చు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. నేచురల్ స్టార్ నానితో జట్టు కట్టబోతున్నాడట. ప్రస్తుతం సలార్ చిత్రం చేస్తున్న ప్రశాంత్.. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో జట్టు కడతాడన్న సంగతి తెలిసిందే. దాని తర్వాత కేజీఎఫ్-3 ఉండొచ్చన్నది ప్రస్తుతానికి ఉన్న అంచనా.
కానీ ఎన్టీఆర్ సినిమా తర్వాత.. నానితో ప్రశాంత్ సినిమా చేస్తాడని.. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతోందని సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతుండటం విశేషం. కానీ అసలు ప్రశాంత్ ఏంటి.. నానీతో సినిమా చేయడమేంటి అని నెటిజన్లు విస్తుబోతున్నారు. ఎందుకంటే వీళ్లిద్దరికీ ఏ రకంగానూ సింక్ అయ్యే అవకాశాలు లేవు.
ప్రశాంత్ ఊర మాస్గా, హీరో ఎలివేషన్లతో సినిమాలు తీస్తాడు. కేజీఎఫ్తో అతను ఎంత పెద్ద స్థాయికి వెళ్లిపోయాడో తెలిసిందే. ఇకపై ప్రశాంత్.. సూపర్ స్టార్లతోనే సినిమాలు చేసేలా ఉన్నాడు. అతడితో సినిమా చేయడానికి టాప్ స్టార్లు పోటీ పడుతున్నారు.
తారక్ సినిమా అయ్యాక అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్లతో అతను సినిమా చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. మొత్తంగా మున్ముందు తన సినిమాల రేంజే వేరుగా ఉండబోతోంది. అలాంటి దర్శకుడు.. మీడియం రేంజ్ హీరో, పైగా మాస్ ఇమేజ్ లేని నానీతో సినిమా చేస్తాడని ఎవరూ అనుకోరు. అసలు ఈ కాంబినేషన్ గురించి ఎవరూ ఆలోచన కూడా చేయరు. అలాంటిది ఈ కలయిక గురించి ఎందుకు ప్రచారం జరుగుతోందో అర్థం కావడం లేదు. నిజంగా ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా.. లేక కావాలనే ఈ ప్రచారం మొదలుపెట్టి.. ఈ వార్తను వైరల్ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on May 23, 2022 7:20 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…