బ్లాక్బస్టర్ కొట్టిన డైరెక్టర్ గురించి పాపం అనడమేంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? మరి కొత్త హీరో హీరోయిన్లను పెట్టి తీసిన లవ్ స్టోరీతో వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాక.. మూడేళ్లకు పైగా ఇంకో సినిమా తీయకుండా ఖాళీగా ఉంటే పాపం అనక ఇంకేమనాలి? ఈ చర్చ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా గురించే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. అతడి తొలి సినిమా ఉప్పెన ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా మేకింగ్ దశలోనే చాలా ఆలస్యం అయింది. అనుకున్న దాని కంటే దాదాపు ఏడాది ఆలస్యంగా విడుదలైంది. ఆలస్యమైతే అయ్యింది కానీ.. సినిమా చాలా పెద్ద హిట్టయిందని సంబరపడితే.. ఆ తర్వాత రెండో సినిమా విషయంలో సుదీర్ఘ నిరీక్షణ తప్పేలా లేదు బుచ్చిబాబుకు.
ఉప్పెన తర్వాత అతడికి మంచి మంచి అవకాశాలే వచ్చాయి. ఐతే తన కెరీర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే సినిమానే చేయాలని, తనకు అప్పటికే మంచి అనుబంధం ఉన్న పెద్ద హీరో జూనియర్ ఎన్టీఆర్కు కథ చెప్పాడు బుచ్చిబాబు. తారక్కు ఆ కథ నచ్చింది, సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. బుచ్చిబాబు తొలి సినిమాను ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓకే చెప్పింది. కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడన్నదే క్లారిటీ లేదు.
బుచ్చిబాబేమో స్క్రిప్టు రెడీ చేసుకుని టెక్నీషియన్ల ఎంపికలో పడ్డాడు. కానీ సినిమా వచ్చే రెండేళ్లలో మొదలయ్యే సూచనలే కనిపించడం లేదు. కొరటాల శివతో తారక్ సినిమా ఆలస్యం అవుతుండటం, ప్రశాంత్ నీల్ సినిమా మీదా క్లారిటీ లేకపోవడంతో బుచ్చిబాబు చిత్రం ముందు మొదలవుతుందేమో అన్న ప్రచారం కూడా జరిగింది ఓ దశలో. అలా కాకపోయినా.. కొరటాల సినిమా తర్వాత ఇదే ఉంటుందని కూడా అన్నారు. కానీ ఇప్పుడు అందుకు ఛాన్సే లేదని తేలిపోయింది.
తన తర్వాతి రెండు చిత్రాలనూ కొరటాల, ప్రశాంత్లతోనే చేయబోతున్నాడు తారక్. కాగా.. ఈ రెండు చిత్రాల తర్వాత తారక్ ఇమేజే మారిపోవచ్చని, అప్పుడు బుచ్చిబాబుతో సినిమా చేస్తాడో లేదో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినా తారక్తో సినిమా చాలా ఆలస్యం అయ్యేలా ఉన్న నేపథ్యంలో బుచ్చిబాబు.. ఈ కథనే పట్టుకుని ఉండటం కరెక్ట్ కాదని, వేరే చిత్రాల కోసం ప్రయత్నించడం మేలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
This post was last modified on May 22, 2022 7:48 am
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024 పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందింది.…
బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ…
ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం…
ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…
ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…