ఒకప్పుడు విక్రమ్ అంటే తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉండేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అపరిచితుడు సాధించిన వసూళ్లు అప్పట్లో ట్రేడ్ ని సైతం నివ్వెరపరిచాయి. దీని పుణ్యమాని ఇతని బిలో యావరేజ్ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అందుకుని డిస్ట్రిబ్యూటర్లకు విక్రమ్ ని మినిమమ్ గ్యారెంటీ హీరోగా మార్చాయి. కానీ అదంతా గతం. ఎంత కష్టపడే తత్వం ఉన్నా సబ్జెక్టు సెలక్షన్లో వరుసగా చేసిన తప్పులకు విలువైన తెలుగు మార్కెట్ కోల్పోవడమనే భారీ మూల్యాన్ని విక్రమ్ చెల్లించాడు.
అందుకే ఇతని కొత్త సినిమా ఏదైనా వస్తోందంటే ప్రేక్షకుల్లో అంత ఎగ్జైట్ మెంట్ కనిపించడం లేదు. ఐ మాత్రమే శంకర్ డైరెక్షన్ అనే బ్రాండ్ తో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇక అసలు విషయానికి వస్తే విక్రమ్ కోబ్రా విడుదల తేదీని ఆగస్ట్ 11 ప్రకటించారు. ఇది ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉన్న మూవీ. అదిగో ఇదిగో అంటూ రిలీజ్ ని వాయిదా వేస్తూ ఎట్టకేలకు థియేటర్లకు తీసుకొస్తున్నారు. కరోనా టైంలో మంచి ఓటిటి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఫైనల్ కాపీ సిద్ధంగా లేని కారణంగా వాటిని వదిలేసుకోవాల్సి వచ్చిందని చెన్నై టాక్.
అదే 11వ తేదీ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా భారీ ఎత్తున రాబోతోంది. అందులో నాగ చైతన్య ఒక ముఖ్యమైన క్యామియో చేశారు. తెలుగు తమిళంలో కూడా డబ్బింగ్ చేయబోతున్నారు. ఇన్ని అంచనాలు మోస్తున్న దీని మీద విక్రమ్ తన కోబ్రాతో పోటీకి దిగడం రిస్కే. పైగా తెలుగులో మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గం, ఏజెంట్, యశోద లాంటి క్రేజీ లైనప్స్ ఉన్నాయి. అలాంటప్పుడు కోబ్రాని బరిలో దించడం వల్ల కలిగే ప్రయోజనం తక్కువ. ఈ సినిమాలో విక్రమ్ 20కి పైగా చిత్రవిచిత్రమైన గెటప్పులు వేయడం విశేషం.
This post was last modified on May 21, 2022 6:51 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…