పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న జానపద చిత్రానికి ముందు భారీ బడ్జెట్ అనుకున్నారు. కానీ పరిస్థితులు మారిపోవడంతో ఇప్పుడు ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కడ తగ్గించవచ్చు అనేది తర్కిస్తున్నారు. కథాపరంగా, పోరాట దృశ్యాల పరంగా క్రిష్ రాజీ పడలేనని చెప్పాడట.
అయితే ఈ చిత్రంలో డ్యూయెట్స్ అవసరం లేదని భావిస్తున్నాడట. దాని వల్ల హీరోయిన్ కి ఎక్కువ మొత్తం వెచ్చించనవసరం లేదు. అలాగే పాటలకు భారీ సెట్లు అవసరం లేదు. ప్రస్తుతానికి కీరవాణితో రెండు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ మాత్రం చేయించుకున్నారట. అవసరాన్ని బట్టి పాటలు పెంచడం, తగ్గించడం గురించి ఆలోచించాలని, నిర్మాతకు తెలియజేసాడట.
ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ మొదలు కావడానికి చాలా సమయం ఉందని అంటున్నారు. వకీల్ సాబ్ పూర్తయిన తర్వాతే దీనిని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
This post was last modified on June 24, 2020 4:59 pm
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…
మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా…
సినిమా నచ్చితే మరోసారి చూడటం, టికెట్లు దొరకకపోతే మరో షోకు వెళ్లడం చూస్తుంటాం. కానీ తమకు కావాల్సిన సినిమాను థియేటర్…
బిహార్ యువత హక్కుల కోసం గొంతెత్తిన ఆరేళ్ల బాలుడు ఆదిత్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. విద్యార్థుల ఉద్యోగాలు,…