పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న జానపద చిత్రానికి ముందు భారీ బడ్జెట్ అనుకున్నారు. కానీ పరిస్థితులు మారిపోవడంతో ఇప్పుడు ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కడ తగ్గించవచ్చు అనేది తర్కిస్తున్నారు. కథాపరంగా, పోరాట దృశ్యాల పరంగా క్రిష్ రాజీ పడలేనని చెప్పాడట.
అయితే ఈ చిత్రంలో డ్యూయెట్స్ అవసరం లేదని భావిస్తున్నాడట. దాని వల్ల హీరోయిన్ కి ఎక్కువ మొత్తం వెచ్చించనవసరం లేదు. అలాగే పాటలకు భారీ సెట్లు అవసరం లేదు. ప్రస్తుతానికి కీరవాణితో రెండు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ మాత్రం చేయించుకున్నారట. అవసరాన్ని బట్టి పాటలు పెంచడం, తగ్గించడం గురించి ఆలోచించాలని, నిర్మాతకు తెలియజేసాడట.
ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ మొదలు కావడానికి చాలా సమయం ఉందని అంటున్నారు. వకీల్ సాబ్ పూర్తయిన తర్వాతే దీనిని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
This post was last modified on June 24, 2020 4:59 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…