పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న జానపద చిత్రానికి ముందు భారీ బడ్జెట్ అనుకున్నారు. కానీ పరిస్థితులు మారిపోవడంతో ఇప్పుడు ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కడ తగ్గించవచ్చు అనేది తర్కిస్తున్నారు. కథాపరంగా, పోరాట దృశ్యాల పరంగా క్రిష్ రాజీ పడలేనని చెప్పాడట.
అయితే ఈ చిత్రంలో డ్యూయెట్స్ అవసరం లేదని భావిస్తున్నాడట. దాని వల్ల హీరోయిన్ కి ఎక్కువ మొత్తం వెచ్చించనవసరం లేదు. అలాగే పాటలకు భారీ సెట్లు అవసరం లేదు. ప్రస్తుతానికి కీరవాణితో రెండు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ మాత్రం చేయించుకున్నారట. అవసరాన్ని బట్టి పాటలు పెంచడం, తగ్గించడం గురించి ఆలోచించాలని, నిర్మాతకు తెలియజేసాడట.
ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ మొదలు కావడానికి చాలా సమయం ఉందని అంటున్నారు. వకీల్ సాబ్ పూర్తయిన తర్వాతే దీనిని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
This post was last modified on June 24, 2020 4:59 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…