ఫ్మూడేళ్ల కిందట విడుదలైన అల్లు అర్జున్ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా ఫలితమేంటో అందరికీ తెలుసు. విడుదలకు ముందున్న హైప్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చి ఉండొచ్చు కానీ.. ఆ చిత్రం జనాల మెప్పు పొందలేదన్నది వాస్తవం. దీనికి రివ్యూలన్నీ నెగెటివ్, యావరేజ్గానే వచ్చాయి. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా మిక్స్డ్గానే కనిపించింది. బాక్సాఫీస్ లెక్కల్లో చూసినా ఈ సినిమా ఫ్లాపే. ఈ విషయాన్ని ఎవరో ఎందుకు.. స్వయంగా నిర్మాత దిల్ రాజే ఒప్పుకున్నాడు.
సినిమా రిలీజైనపుడు ఆయన కూడా కలెక్షన్ల గురించి గొప్పగా చెప్పుకున్నాడు కానీ.. ఆ తర్వాత ఓ సందర్భంలో సినిమా బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టిందని.. ‘ఫిదా’ సినిమాకు తన బయ్యర్లు తక్కువ డబ్బులు కట్టి లాస్ను కవర్ చేసుకున్నారని అన్నారాయన. బన్నీ సైతం ఈ సినిమా గురించి ఆ తర్వాత ఎప్పుడూ పెద్దగా చెప్పుకున్నది లేదు.
కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ‘డీజే’ ఫ్లాప్ అంటే ఒప్పుకోడు. సినిమా రిలీజ్ తర్వాత రివ్యూయర్లపై, సినిమా గురించి నెగెటివ్గా మాట్లాడేవాళ్లపై అతనెలా విరుచుకుపడ్డాడో తెలిసిందే. ఇప్పుడు ‘డీజే’ విడుదలై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో హరీష్ ట్విట్టర్లో పెద్ద ఎత్తునే సంబరాలు చేశాడు. అల్లు అర్జున్ అభిమానులు కూడా ‘డీజే’ హ్యాష్ ట్యాగ్స్తో నిన్నంతా రెచ్చిపోయి ట్రెండ్స్ చేశారు. బన్నీ కెరీర్లోనే దువ్వాడ జగన్నాథం బెస్ట్ క్యారెక్టర్లలో ఒకటన్నట్లు.. ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్, ఒక క్లాసిక్ అన్నట్లుగా ట్వీట్లు గుప్పించారు. మిలియిన్లు మిలియన్లు టార్గెట్గా పెట్టుకుని ట్రెండ్స్ నడిపించారు.
ఈ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సినిమా స్థాయి ఏంటో చూడకుండా వార్షికోత్సవ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి హడావుడి చేయడం మామూలైపోయింది. ‘జానీ’ లాంటి ఆల్ టైం డిజాస్టర్కు కూడా పెద్ద ట్రెండే నడిచింది. ఈ కోవలోనే ‘డీజే’ గురించి కూడా హడావుడి చేశారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా.. ‘క్లాసిక్’ స్టేటస్ అందుకుని జనాల మనసుల్లో నిలిచిపోతాయి.
‘డీజే’ ఆ కోవకు చెందింది కూడా కాదన్నది సినిమా చూసిన ఎవ్వరైనా అంగీకరిస్తారు. అయినా పది పన్నెండేళ్ల పిల్లాడు గన్ను పట్టి రౌడీల్ని, గూండాల్ని ఏరేయడానికి రెడీ అయితే.. ఒక పోలీసాఫీసర్ అతడితో చేతులు కలిపి మిషన్ మొదలుపెట్టడం అనే సిల్లీ కాన్సెప్ట్తో మొదలయ్యే సినిమా ‘డీజే’ అన్నది బన్నీ ఫ్యాన్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే దాని గురించి ఇంత హంగామా చేసే వాళ్లు కాదేమో.
This post was last modified on June 27, 2020 10:11 am
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…