సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట భారీ అంచనాల మధ్య ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస హిట్ల తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ కూడా చివరగా గీత గోవిందంతో బ్లాక్బస్టర్ కొట్టాడు. సర్కారు వారి పాట పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రి రిలీజ్ బజ్ అయితే బాగానే కనిపిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ఊపుమీదే సాగుతున్నాయి. కాకపోతే మహేష్ ఇటీవలి ట్రాక్ రికార్డు, ఇతర సానుకూలతల్ని బట్టి చూస్తే ఇంకా జోష్ ఉండాలి. కానీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేశాక కొంత స్తబ్ధత నెలకొన్న మాట వాస్తవం. కాబట్టి కొంచెం జోరు తగ్గడాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఐతే తెలుగు రాష్ట్రాల అవతల సర్కారు వారి పాట విషయంలో సందడే కనిపించకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.
బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో మామూలుగా మహేష్ సినిమాలు రిలీజవుతుంటే బాగా హడావుడి ఉంటుంది. తెలుగు వెర్షన్కే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతాయి. కానీ సర్కారు వారి పాట విషయంలో అలా జరగడం లేదు. రిలీజ్ ముందు రోజు కూడా బుక్ మై షోలో పచ్చ రంగే కనిపిస్తోంది. సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ ట్రెండ్సే కనిపించడం లేదు. చాలా తక్కువ షోలకే ఫుల్స్ పడే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నైలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా ఉన్నాయి.
ఇండియాలో మిగతా సిటీల్లో కూడా సర్కారు వారి పాట సందడి అంతంతమాత్రంగానే ఉంది. ఓవర్సీస్లో కూడా మామూలుగా మహేష్ సినిమాలకు కనిపించే హంగామా ఈ చిత్రానికి లేదని బుకింగ్స్, ఇతర అంశాలను బట్టి అర్థమవుతోంది. ఐతే ఇది మహేష్ సినిమా సమస్యగా చూడలేం. ఓవరాల్గా బాక్సాఫీస్ పరిస్థితే అలా ఉంది. రెండు వారాల కిందట వచ్చిన ఆచార్యకు అంత దారుణమైన ఫలితం రావడానికి కూడా ఇదే కారణం.
This post was last modified on May 11, 2022 7:15 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…