సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట భారీ అంచనాల మధ్య ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస హిట్ల తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ కూడా చివరగా గీత గోవిందంతో బ్లాక్బస్టర్ కొట్టాడు. సర్కారు వారి పాట పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రి రిలీజ్ బజ్ అయితే బాగానే కనిపిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ఊపుమీదే సాగుతున్నాయి. కాకపోతే మహేష్ ఇటీవలి ట్రాక్ రికార్డు, ఇతర సానుకూలతల్ని బట్టి చూస్తే ఇంకా జోష్ ఉండాలి. కానీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేశాక కొంత స్తబ్ధత నెలకొన్న మాట వాస్తవం. కాబట్టి కొంచెం జోరు తగ్గడాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఐతే తెలుగు రాష్ట్రాల అవతల సర్కారు వారి పాట విషయంలో సందడే కనిపించకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.
బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో మామూలుగా మహేష్ సినిమాలు రిలీజవుతుంటే బాగా హడావుడి ఉంటుంది. తెలుగు వెర్షన్కే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతాయి. కానీ సర్కారు వారి పాట విషయంలో అలా జరగడం లేదు. రిలీజ్ ముందు రోజు కూడా బుక్ మై షోలో పచ్చ రంగే కనిపిస్తోంది. సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ ట్రెండ్సే కనిపించడం లేదు. చాలా తక్కువ షోలకే ఫుల్స్ పడే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నైలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా ఉన్నాయి.
ఇండియాలో మిగతా సిటీల్లో కూడా సర్కారు వారి పాట సందడి అంతంతమాత్రంగానే ఉంది. ఓవర్సీస్లో కూడా మామూలుగా మహేష్ సినిమాలకు కనిపించే హంగామా ఈ చిత్రానికి లేదని బుకింగ్స్, ఇతర అంశాలను బట్టి అర్థమవుతోంది. ఐతే ఇది మహేష్ సినిమా సమస్యగా చూడలేం. ఓవరాల్గా బాక్సాఫీస్ పరిస్థితే అలా ఉంది. రెండు వారాల కిందట వచ్చిన ఆచార్యకు అంత దారుణమైన ఫలితం రావడానికి కూడా ఇదే కారణం.
This post was last modified on May 11, 2022 7:15 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…