సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట భారీ అంచనాల మధ్య ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస హిట్ల తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ కూడా చివరగా గీత గోవిందంతో బ్లాక్బస్టర్ కొట్టాడు. సర్కారు వారి పాట పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రి రిలీజ్ బజ్ అయితే బాగానే కనిపిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ఊపుమీదే సాగుతున్నాయి. కాకపోతే మహేష్ ఇటీవలి ట్రాక్ రికార్డు, ఇతర సానుకూలతల్ని బట్టి చూస్తే ఇంకా జోష్ ఉండాలి. కానీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేశాక కొంత స్తబ్ధత నెలకొన్న మాట వాస్తవం. కాబట్టి కొంచెం జోరు తగ్గడాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఐతే తెలుగు రాష్ట్రాల అవతల సర్కారు వారి పాట విషయంలో సందడే కనిపించకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.
బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో మామూలుగా మహేష్ సినిమాలు రిలీజవుతుంటే బాగా హడావుడి ఉంటుంది. తెలుగు వెర్షన్కే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతాయి. కానీ సర్కారు వారి పాట విషయంలో అలా జరగడం లేదు. రిలీజ్ ముందు రోజు కూడా బుక్ మై షోలో పచ్చ రంగే కనిపిస్తోంది. సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ ట్రెండ్సే కనిపించడం లేదు. చాలా తక్కువ షోలకే ఫుల్స్ పడే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నైలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా ఉన్నాయి.
ఇండియాలో మిగతా సిటీల్లో కూడా సర్కారు వారి పాట సందడి అంతంతమాత్రంగానే ఉంది. ఓవర్సీస్లో కూడా మామూలుగా మహేష్ సినిమాలకు కనిపించే హంగామా ఈ చిత్రానికి లేదని బుకింగ్స్, ఇతర అంశాలను బట్టి అర్థమవుతోంది. ఐతే ఇది మహేష్ సినిమా సమస్యగా చూడలేం. ఓవరాల్గా బాక్సాఫీస్ పరిస్థితే అలా ఉంది. రెండు వారాల కిందట వచ్చిన ఆచార్యకు అంత దారుణమైన ఫలితం రావడానికి కూడా ఇదే కారణం.
This post was last modified on May 11, 2022 7:15 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…