సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట భారీ అంచనాల మధ్య ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస హిట్ల తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ కూడా చివరగా గీత గోవిందంతో బ్లాక్బస్టర్ కొట్టాడు. సర్కారు వారి పాట పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రి రిలీజ్ బజ్ అయితే బాగానే కనిపిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ఊపుమీదే సాగుతున్నాయి. కాకపోతే మహేష్ ఇటీవలి ట్రాక్ రికార్డు, ఇతర సానుకూలతల్ని బట్టి చూస్తే ఇంకా జోష్ ఉండాలి. కానీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేశాక కొంత స్తబ్ధత నెలకొన్న మాట వాస్తవం. కాబట్టి కొంచెం జోరు తగ్గడాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఐతే తెలుగు రాష్ట్రాల అవతల సర్కారు వారి పాట విషయంలో సందడే కనిపించకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.
బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో మామూలుగా మహేష్ సినిమాలు రిలీజవుతుంటే బాగా హడావుడి ఉంటుంది. తెలుగు వెర్షన్కే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతాయి. కానీ సర్కారు వారి పాట విషయంలో అలా జరగడం లేదు. రిలీజ్ ముందు రోజు కూడా బుక్ మై షోలో పచ్చ రంగే కనిపిస్తోంది. సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ ట్రెండ్సే కనిపించడం లేదు. చాలా తక్కువ షోలకే ఫుల్స్ పడే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నైలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా ఉన్నాయి.
ఇండియాలో మిగతా సిటీల్లో కూడా సర్కారు వారి పాట సందడి అంతంతమాత్రంగానే ఉంది. ఓవర్సీస్లో కూడా మామూలుగా మహేష్ సినిమాలకు కనిపించే హంగామా ఈ చిత్రానికి లేదని బుకింగ్స్, ఇతర అంశాలను బట్టి అర్థమవుతోంది. ఐతే ఇది మహేష్ సినిమా సమస్యగా చూడలేం. ఓవరాల్గా బాక్సాఫీస్ పరిస్థితే అలా ఉంది. రెండు వారాల కిందట వచ్చిన ఆచార్యకు అంత దారుణమైన ఫలితం రావడానికి కూడా ఇదే కారణం.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…