Movie News

ఒక్క సీన్ కోసం 3 వేల కోట్లు వదులుకున్నారట


సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డులు అభ్యంతరాలు చెప్పడం.. కథా గమనానికి అవి పెద్ద అడ్డం కానపుడు చిత్ర బృందాలు వాటికి కోత వేయడం.. లేదంటే రివైజ్ కమిటీలకు వెళ్లి అనుమతులు సంపాదించడం మామూలే. వేరే అవకాశం లేనపుడు, సదరు సన్నివేశాల వల్ల సినిమా రిలీజే ఆగిపోతుంది అన్నపుడు ఎవరైనా ఏం చేస్తారు. సదరు సన్నివేశాన్ని తీసేయడానికే చూస్తారు.

అందులోనూ ఒక సన్నివేశం వల్ల వేల కోట్ల ఆదాయం పోతుందంటే ఏ చిత్ర బృందమైనా రాజీ పడకుండా ఉంటుందా? కానీ సోనీ పిక్చర్స్ మాత్రం దాదాపు రూ. వేల కోట్ల దాకా ఆదాయం పోతుందని తెలిసి కూడా ఒక సన్నివేశాన్ని తమ చిత్రం నుంచి తొలగించడానికి ఒప్పుకోలేదట. చివరికి అంత భారీ ఆదాయాన్ని వదులుకున్నారే తప్ప సదరు సన్నివేశాన్ని మాత్రం తొలగించలేదట. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించిన ‘స్సైడర్ మ్యాన్: నో వే హోమ్’ విషయంలో ఇలా జరిగిందట.

హాలీవుడ్ చిత్రాలకు అమెరికా తర్వాత అత్యధిక ఆదాయం వచ్చే దేశం అంటే చైనానే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండే ఆ దేశంలో మంచి క్రేజున్న హాలీవుడ్ సినిమాలను రిలీజ్ చేస్తే వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆమిర్ ఖాన్ సినిమా ‘దంగల్’యే అక్కడ రూ.1200 కోట్లు కొల్లగొట్టిందంటే ‘స్పైడర్ మ్యాన్’ ఫ్రాంఛైజీ చిత్రానికి అక్కడుండే క్రేజ్, వచ్చే వసూళ్లు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చు.

ఐతే ఈ సినిమాను గత ఏడాది చైనాలో రిలీజ్ చేయడానికి ముందు సెన్సార్ కోసం పంపగా.. పతాక సన్నివేశంలో ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఘట్టం విషయంలో చైనా సెన్సార్ బోర్డు అభ్యంతర పెట్టినట్లు తెలిసింది. కమ్యూనిస్టులు పాలించే చైనాలో పౌరులకు స్వేచ్ఛ ఉండదు. అలాంటి దేశంలో స్వేచ్ఛకు సూచిక అయిన ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ను తెర మీద చూపిస్తే జనాల్లో వేరే భావనలు కలుగుతాయన్న ఉద్దేశంతో అది కనిపించే సన్నివేశాలన్నింటినీ తీసేయాలని సోనీ వారికి చైనా సెన్సార్ బోర్డు చెప్పిందట. చివరికి ఈ సన్నివేశాలను ట్రిమ్ చేయాలని సూచించిందట. కానీ సోనీ పిక్చర్స్ అందుకు నిరాకరించడంతో ‘స్పైడర్ మ్యాన్’ చైనాలో రిలీజ్ కానే లేదు. ప్రపంచవ్యాప్తంగా ‘నో వే హోమ్’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా చైనాలో రూ.3 వేల కోట్ల దాకా ఆదాయం వచ్చేదట. కానీ చైనీస్ సెన్సార్ బోర్డు చెప్పినట్లు సదరు సన్నివేశం తీసేయకపోవడం వల్ల రిలీజ్ ఆగిపోయి ఇంత ఆదాయాన్ని కోల్పోయిందట సోనీ సంస్థ.

This post was last modified on May 7, 2022 9:58 pm

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

2 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

2 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

4 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

5 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

6 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

7 hours ago