మహేష్ బాబు , పరశురాం కాంబినేషన్ లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ పై బజ్ స్టార్టయింది. మొన్నటి వరకూ సినిమాపై ఉన్న ఓ మోస్తారు అంచనాలని ట్రైలర్ అమాంతంగా పెంచేసింది. మహేష్ నుండి ఫ్యాన్స్ , ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారో సరిగ్గా అవన్నీ సినిమాలో ఉంటాయని ట్రైలర్ తో చూపించేశాడు దర్శకుడు. అయితే సినిమాలో దీనికి మించి అదిరిపోయే కంటెంట్ ఉంటుందని యూనిట్ గట్టిగా చెప్తోంది. అలాగే పోకిరి తరహాలో ఇందులో ఓ ట్విస్ట్ ఉంటుందని దానికి ఆడియన్స్ ఫిదా అవ్వడం ఖాయమని ఇన్సైడ్ టాక్.
ట్రైలర్ చూస్తే మహేష్ బ్యాంక్ లో అమౌంట్ రికవరీ చేసే పెర్సన్ గా కనిపిస్తున్నాడు. కానీ తను బ్యాంక్ ఓనర్ అనే సాలిడ్ ట్విస్ట్ తో పరశురాం ఏదో ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇక కీర్తి చుట్టూ చక్కర్లు కొట్టడం ఆమెని ప్రేమలో పడేయడం వెనుక కూడా ఏదో ట్విస్ట్ ఉంటుందని విలన్ ని పట్టుకునేందుకు హీరోయిన్ ని హీరో వాడుకుంటాడని ఓ లీక్ చక్కర్లు కొడుతుంది.
నిజానికి ఓ బడా సినిమా వస్తుంటే రిలీజ్ కి ముందు ఆ సినిమా చుట్టూ ఇలాంటి లీక్స్ వినిపిస్తూనే ఉంటాయి. సర్కారు చుట్టూ కూడా ఇలాంటి లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటిలో నిజమెంత ? అసలు ఈ ట్విస్టులు సినిమాలో ఉంటాయా అనేది తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. రిలీజ్ కి ఇంకా వారం రోజులే ఉండటంతో టీం భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఆచార్య’ తో ఊపు తగ్గిన బాక్సాఫీస్ ని ఈ సినిమాతో మహేష్ ఎలా సెట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on May 5, 2022 8:27 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…