ఇటివలే ‘రాజ రాజ చోర’తో డీసెంట్ హిట్ కొట్టిన శ్రీ విష్ణు ఆ వెంటనే ‘అర్జున ఫల్గున’ తో ఫ్లాప్ అందుకున్నాడు. ఒకప్పుడు బెస్ట్ స్క్రిప్ట్స్ ఎంచుకొని ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం సక్సెస్ రేషియో తగ్గించేసుకుంటున్నాడు. శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘భళా తందనాన’ సినిమాకి బజ్ లేకపోవడమే దీనికి ఉదాహరణ. తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఓ సాలిడ్ హిట్ అందుకోకపోవడం ఈ హీరోకి ఓ పెద్ద రిమార్క్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు తన కెరీర్ మీద ఫోకస్ పెట్టి మళ్ళీ విభిన్న కథలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు శ్రీ విష్ణు.
తనకి లేటెస్ట్ గా ‘రాజ రాజ చోర’ తో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హసిత్ గోలితో ఓ డిఫరెంట్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో శ్రీ విష్ణు మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ‘భళా తందనాన’ ప్రమోషన్ల్ ఇంటర్వ్యూ లో కన్ఫర్మ్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎనౌన్స్ మెంట్ రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ కాంబో సినిమాను నిర్మిస్తుంది.
ఇప్పటి వరకూ యంగ్ హీరోల్లో ఎవరికీ ట్రిపుల్ రోల్ చేసే స్క్రిప్ట్ దొరకలేదు. ఆ ఛాన్స్ శ్రీ విష్ణుకే దక్కిందని చెప్పొచ్చు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ , ఏఎన్నార్ , శోభన్ బాబు , కృష్ణ , చిరంజీవి , బాలకృష్ణ ట్రిపుల్ రోల్స్ చేసి నటులుగా ఆకట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ ‘జై లవకుశ’ తర్వాత తెలుగులో మళ్ళీ ట్రిపుల్ రోల్ సినిమా రాలేదు. ఇప్పుడు శ్రీ విష్ణు ఈ మూవీతో ఆ కేటగిరిలో చేరబోతున్నాడు. తన నుండి రాబోయే ‘అల్లూరి’ సినిమా మీద కూడా ఈ యంగ్ హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన కెరీర్ లో ఈ సినిమా సెన్సేషన్ అవుతుందని చెప్తున్నాడు. ఇకపై తన నుండి ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని డిఫరెంట్ కథలతో సినిమాలు రానున్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూ చెప్పుకున్నాడు.
This post was last modified on May 5, 2022 8:25 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…