మాములుగా క్రేజ్ ఉన్న స్టార్ సినిమా థియేటర్ లోనో ఓటిటిలోనో వస్తోందంటే ఒకరకమైన సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూద్దామాని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రైమ్ లో రేపు విడుదల కాబోతున్న కీర్తి సురేష్ చిన్ని(సాని కడియం) గురించి ఎక్కడా చప్పుడే లేదు. మాములుగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లకి ఓ రేంజ్ లో హడావిడి చేసే అమెజాన్ ప్రైమ్ ఏమంత సౌండ్ చేయడం లేదు. కనీసం రిలీజ్ అవుతోందన్న అవగాహన కూడా కామన్ ఆడియెన్స్ కి లేకుండా పోయింది. అంత వీక్ పబ్లిసిటీ మరి.
అలా అని కీర్తి సురేష్ కి ఫాలోయింగ్ తగ్గిందనో ఇమేజ్ లేదనో కాదు. కాకపోతే గత రెండేళ్లలో తనను ప్రధాన పాత్రలో బేస్ చేసుకుని వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. పెంగ్విన్ ఇదే ప్రైమ్ లో డిజాస్టర్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన మిస్ ఇండియా ఇంకా దారుణం. ఇలా తీశారేమని విమర్శకులు తలంటారు. ఇవి కాకుండా సాహసం చేసి థియేటర్లలో వదిలిన గుడ్ లక్ సఖి కొన్నవాళ్లకు బ్యాడ్ డ్రీమ్ అయ్యింది. దెబ్బకు తనను సోలో లీడ్ క్యారెక్టర్స్ లో చూసేందుకు జనం అంతగా ఇష్టపడటం లేదు. అందుకే ఈ వీక్ బజ్.
చిన్నిలో ప్రముఖ దర్శకులు సెల్వ రాఘవన్ చాలా కీలకమైన క్యారెక్టర్ చేశారు. తనవాళ్లను అన్యాయంగా కోల్పోయిన ఓ లేడీ కానిస్టేబుల్ ఉద్యోగం మానేసి దానికి కారణమైన వాళ్ళను దారుణంగా చంపి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడుతుంది. ఇరవై నాలుగు మర్డర్లు చేసి పోలీసులకు దడ పుట్టిస్తుంది. ఇది చిన్ని కథ. పాయింట్ పాతదే కానీ దర్శకుడు అరుణ్ మాతేష్వరన్ కొత్తగా ప్రెజెంట్ చేశారట. సర్కారు వారి పాటలో ఫుల్ గ్లామరస్ గా కనిపించనున్న కీర్తి సురేష్ ని అంతకన్నా ముందు ఇంత రఫ్ రా క్యారెక్టర్ లో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. రాత్రి 12కు ముందే స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది.
This post was last modified on May 5, 2022 8:30 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…