మాములుగా క్రేజ్ ఉన్న స్టార్ సినిమా థియేటర్ లోనో ఓటిటిలోనో వస్తోందంటే ఒకరకమైన సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూద్దామాని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రైమ్ లో రేపు విడుదల కాబోతున్న కీర్తి సురేష్ చిన్ని(సాని కడియం) గురించి ఎక్కడా చప్పుడే లేదు. మాములుగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లకి ఓ రేంజ్ లో హడావిడి చేసే అమెజాన్ ప్రైమ్ ఏమంత సౌండ్ చేయడం లేదు. కనీసం రిలీజ్ అవుతోందన్న అవగాహన కూడా కామన్ ఆడియెన్స్ కి లేకుండా పోయింది. అంత వీక్ పబ్లిసిటీ మరి.
అలా అని కీర్తి సురేష్ కి ఫాలోయింగ్ తగ్గిందనో ఇమేజ్ లేదనో కాదు. కాకపోతే గత రెండేళ్లలో తనను ప్రధాన పాత్రలో బేస్ చేసుకుని వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. పెంగ్విన్ ఇదే ప్రైమ్ లో డిజాస్టర్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన మిస్ ఇండియా ఇంకా దారుణం. ఇలా తీశారేమని విమర్శకులు తలంటారు. ఇవి కాకుండా సాహసం చేసి థియేటర్లలో వదిలిన గుడ్ లక్ సఖి కొన్నవాళ్లకు బ్యాడ్ డ్రీమ్ అయ్యింది. దెబ్బకు తనను సోలో లీడ్ క్యారెక్టర్స్ లో చూసేందుకు జనం అంతగా ఇష్టపడటం లేదు. అందుకే ఈ వీక్ బజ్.
చిన్నిలో ప్రముఖ దర్శకులు సెల్వ రాఘవన్ చాలా కీలకమైన క్యారెక్టర్ చేశారు. తనవాళ్లను అన్యాయంగా కోల్పోయిన ఓ లేడీ కానిస్టేబుల్ ఉద్యోగం మానేసి దానికి కారణమైన వాళ్ళను దారుణంగా చంపి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడుతుంది. ఇరవై నాలుగు మర్డర్లు చేసి పోలీసులకు దడ పుట్టిస్తుంది. ఇది చిన్ని కథ. పాయింట్ పాతదే కానీ దర్శకుడు అరుణ్ మాతేష్వరన్ కొత్తగా ప్రెజెంట్ చేశారట. సర్కారు వారి పాటలో ఫుల్ గ్లామరస్ గా కనిపించనున్న కీర్తి సురేష్ ని అంతకన్నా ముందు ఇంత రఫ్ రా క్యారెక్టర్ లో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. రాత్రి 12కు ముందే స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…