తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘటికుడు’ సినిమా చూశారా? అందులో ఆ చిత్ర బృందం ఒక ప్రయోగం చేసింది. సూర్య చిన్నప్పటి పాత్రకు చిన్న పిల్లాడెవరినీ తీసుకోకుండా.. సూర్యనే చూపించారందులో. సూర్యకు మీసం తీసేసి.. అతడి ముఖాన్నే చిన్న పిల్లాడి లాగా వీఎఫ్ఎక్స్ ద్వారా మార్చి అతణ్నో టీనేజీ కుర్రాడిగా మార్చారు. ఐతే అలా చూపించిన సన్నివేశాలు చాలా కృతకంగా అనిపించి ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టాయి.
యూట్యూబ్లోకి వెళ్లి ఇప్పుడు ఆ సన్నివేశాలు చూసినా చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాకు కూడా ఇలాంటి ప్రయోగమే చేయగా.. అది బెడిసికొట్టేసింది. ఈ చిత్రంలో చిరంజీవిని యువకుడిగా చూపించాల్సిన అవసరం పడింది ఓ సన్నివేశంలో. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఆ సీన్లో చిరుకు కుర్రాడిలా మేకప్ వేసి మేనేజ్ చేయాల్సిందేమో. లేదా ఆ సన్నివేశంలో చిరు లేనట్లుగా చూపించాల్సింది. కానీ కొరటాల ఆ ప్రయత్నం చేయలేదు.
చిరు కెరీర్ తొలి నాళ్లలోని ఒక ఫొటో బయటికి తీసి వీఎఫ్ఎక్స్ ద్వారా ఆ లుక్తోనే చిరు హావభావాలు పలికిస్తున్నట్లు చూపించాడు. ఐతే ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా బెడిసి కొట్టేశాయి. చాలా కృత్రిమంగా, కృతకంగా అనిపించిందా సన్నివేశం. చిరును అలా చూడలేకపోయారు అభిమానులు. ఎప్పుడెప్పుడు ఆ సన్నివేశం ముగుస్తుందా అనిపించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అసలే సినిమాకు నెగెటివ్ టాక్ రాగా.. దీనికి తోడు ఇలాంటి సన్నివేశం ఉండటంతో సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా? అప్పుడే ఈ సన్నివేశం ట్రోల్ మెటీరియల్గా మారిపోయింది. చాలామంది యాంటీ ఫ్యాన్స్ ఆ సన్నివేశంలో చిరు లుక్ను డీపీగా మార్చేసుకున్నారు. కొన్నిసార్లు చిన్న సన్నివేశాలే సినిమాకు చాలా చేటు చేస్తుంటాయి. ప్రేక్షకుల్లో విపరీతమైన నెగెటివిటీని పెంచుతాయి. ఇది కూడా అలాంటి సన్నివేశమే అని చెప్పాలి. ఈ సీన్ మెగా అభిమానులను చాలా కాలం వెంటాడేలా కనిపిస్తోంది.
This post was last modified on April 29, 2022 8:01 pm
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…