Movie News

ఒక దర్శకుడు.. పది మంది హీరోయిన్లు

‘అ!’ అనే వైవిధ్యమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో అలాంటి కథాకథనాలతో సినిమా రావడం అరుదు. ఈ చిత్రం సగటు ప్రేక్షకులకు అర్థం కాకపోవడం, వారికి రుచించకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్నందుకోలేదు కానీ.. ప్రశాంత్ ప్రయత్నానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా దక్కాయి. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే విషయంలో కొత్త టెక్నిక్‌ను అనుసరించిన ప్రశాంత్.. తర్వాతి రెండు చిత్రాలను మామూలు స్టయిల్లోనే లాగించేశాడు.

కల్కి, జాంబి రెడ్డి మామూలు సినిమాల్లాగే ఉంటాయి. ఇప్పుడతను ‘హనుమాన్’ అనే సూపర్ హీరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జాంబిరెడ్డి’తో హీరోగా పరిచయం అయిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంతో మరోసారి ప్రశాంత్ ప్రయోగమే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీని తర్వాత ప్రశాంత్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అతను పది మంది హీరోయిన్లలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.

‘అ!’ తరహాలోనే ఇది కూడా ఒక విభిన్నమైన సినిమా అని అంటున్నారు. ఒక పాత్రకు ఇంకో పాత్రకు ముడిపెడుతూ.. చివర్లో అన్ని పాత్రలకు ఒక లింక్ పెట్టి స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడానికి ప్రశాంత్ ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. బహుశా ఇది కూడా ‘అ!’ తరహా చిత్రమే అయ్యుండొచ్చు. అందులో కూడా ఇలాగే చాలా క్యారెక్టర్లుంటాయి. వాటి కథలను సమాంతరంగా చూపిస్తూ వెళ్తాడు. చివర్లో వాటికున్న లింక్ ఏంటన్నది వెల్లడవుతుంది. నిజానికి ‘అ!’ చిత్రానికి సీక్వెల్ తీయాలని ప్రశాంత్ ఎంతో ఆశపడ్డాడు.

దానికి స్క్రిప్టు కూడా అయినట్లు వెల్లడించాడు. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని కీలకపాత్రకు అడిగినట్లు కూడా గతంలో ప్రశాంత్ తెలిపాడు. మరి ఆ ప్రాజెక్టు ఎందుకు కార్యరూపం దాల్చలేదో తెలియదు. ఇప్పుడేమో పది మంది హీరోయిన్లతో సినిమా అంటూ వార్తలొస్తున్నాయి. మరి ఈ వినూత్న ప్రయోగం ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో.. అదెలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

This post was last modified on April 28, 2022 7:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉప ఎన్నికలకు సిద్ఘమంటున్న కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…

17 minutes ago

ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో…

37 minutes ago

ఈసారి ‘అక్కినేని లెక్కలు’ మారబోతున్నాయా

ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…

37 minutes ago

ఆగని పూజా ఫ్లాప్ స్ట్రీక్…

అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…

2 hours ago

ప్రజ్ఞానంద్ చెస్ మాస్టర్స్ ఛాంపియన్… గుకేశ్‌పై ఘన విజయం!

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…

3 hours ago

సుపరిపాలన రూపశిల్పి చంద్రబాబే

1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…

3 hours ago