సౌత్ సినిమాల్లోనే అత్యుత్తమ హీరో విలన్ క్లాష్ గా చెప్పుకునే నరసింహ సినిమాలో రజనీకాంత్ రమ్యకృష్ణల పోటాపోటీ నటన ఎన్ని దశాబ్దాలు గడిచినా మర్చిపోవడం కష్టం. లేడీ విలన్ ని ఇలా కూడా ఎలివేట్ చేయొచ్చా అనే రీతిలో కథకుడు చిన్నికృష్ణ దర్శకుడు కెఎస్ రవికుమార్ చూపించిన తీరుకి ఎన్ని ప్రశంసలు ఇచ్చినా తక్కువే. అందుకే ఎప్పుడు ఈ మూవీ టీవీలో వచ్చినా ఛానల్ మార్చడం కష్టం. అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది.
హీరోయిన్ సౌందర్య కంటే రమ్యకృష్ణకే ఎక్కువ పేరు రావడం న్యాయమే. ఇప్పుడీ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందని కోలీవుడ్ టాక్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక ప్రధానమైన పాత్రకు రమ్యకృష్ణనే లాక్ చేసినట్టు సమాచారం. అందులో నెగటివ్ షేడ్స్ ఉంటాయట.
ఇంకేముంది మరోసారి నరసింహ నీలాంబరిలు పరస్పరం ఛాలెంజ్ చేసుకునే సూపర్ డ్రామాని చూడొచ్చన్న మాట. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉంది. దీని అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడు. గత కొనేళ్లుగా తెలుగు మార్కెట్ మీద పట్టు కోల్పోయిన రజనీకాంత్ బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు.
విజయ్ తో బీస్ట్ రూపంలో ఫ్లాప్ తో విమర్శలనూ మూటగట్టుకున్న నెల్సన్ కు సైతం ఇది హిట్ కావడం చాలా అవసరం. క్యాస్టింగ్ కూడా గట్టిగానే సెట్ చేసుకుంటున్నారు. ఇంత వయసులోనూ విపరీతంగా కష్టపడుతున్న రజనికి ఇదే సన్ పిక్చర్స్ నిర్మించిన పెద్దన్న అనుభవం గట్టి షాకే ఇచ్చింది. మరి నెల్సనైనా సరిగా వాడుకుంటాడా లేక పేట, కాలా దర్శకుల్లా తడబడతాడా వేచి చూడాలి.
This post was last modified on April 28, 2022 3:48 pm
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…