బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తాలూకు మంటలు ఇంకా చల్లారలేదు. వారం తర్వాత కూడా అతడి అభిమానులు, మద్దతుదారులు శాంతించడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా అనేక హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సుశాంత్ తనకు తానుగా ఆత్మహత్యకు పాల్పడలేదని.. ఇది పరోక్షంగా హత్య లాంటిదే అని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు. బాలీవుడ్ మూవీ మాఫియా అతణ్ని టార్గెట్ చేసి చంపేసిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్లతో పాటు బాలీవుడ్ బడాబాబులను, వారసత్వం ద్వారా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లను టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్.
సుశాంత్ నెపోటిజం మీద పోరాడిన ధీరుడని అంటున్న అతడి మద్దతుదారులు.. అతను చనిపోయిన జూన్ 14వ తేదీని వరల్డ్ యాంటీ నెపోటిజం డేగా ప్రకటించడం విశేషం. సుశాంత్ బాలీవుడ్లో చాలామందిలా వారసత్వంతో హీరో కాలేదని.. సొంత ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగాడని.. స్టార్ ఇమేజ్ సంపాదించాడని.. అతను నెపోటిజం మీద విజయం సాధించాడని.. కానీ చివరికి ఈ స్టార్ కిడ్స్, వాళ్లను ప్రమోట్ చేసే వాళ్ల వల్లే ప్రాణాలు కోల్పోయాడని.. అందుకే జూన్ 14వ తేదీని వరల్డ్ యాంటీ నెపోటిజం డేగా ప్రకటిస్తున్నామని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో మంచి స్పందనే వస్తోంది. మద్దతుగా పెద్ద ఎత్తున ట్వీట్లు పడుతున్నాయి. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యను నీరుగార్చేందుకు పోలీసులు బాలీవుడ్ ప్రముఖులతో కలిసి కుమ్మక్కవుతున్నారంటూ సుశాంత్ ఫ్యాన్స్ ఆరోపిస్తూ ట్వీట్లు వేస్తున్నారు.
This post was last modified on June 22, 2020 11:52 pm
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…