బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తాలూకు మంటలు ఇంకా చల్లారలేదు. వారం తర్వాత కూడా అతడి అభిమానులు, మద్దతుదారులు శాంతించడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా అనేక హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సుశాంత్ తనకు తానుగా ఆత్మహత్యకు పాల్పడలేదని.. ఇది పరోక్షంగా హత్య లాంటిదే అని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు. బాలీవుడ్ మూవీ మాఫియా అతణ్ని టార్గెట్ చేసి చంపేసిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్లతో పాటు బాలీవుడ్ బడాబాబులను, వారసత్వం ద్వారా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లను టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్.
సుశాంత్ నెపోటిజం మీద పోరాడిన ధీరుడని అంటున్న అతడి మద్దతుదారులు.. అతను చనిపోయిన జూన్ 14వ తేదీని వరల్డ్ యాంటీ నెపోటిజం డేగా ప్రకటించడం విశేషం. సుశాంత్ బాలీవుడ్లో చాలామందిలా వారసత్వంతో హీరో కాలేదని.. సొంత ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగాడని.. స్టార్ ఇమేజ్ సంపాదించాడని.. అతను నెపోటిజం మీద విజయం సాధించాడని.. కానీ చివరికి ఈ స్టార్ కిడ్స్, వాళ్లను ప్రమోట్ చేసే వాళ్ల వల్లే ప్రాణాలు కోల్పోయాడని.. అందుకే జూన్ 14వ తేదీని వరల్డ్ యాంటీ నెపోటిజం డేగా ప్రకటిస్తున్నామని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో మంచి స్పందనే వస్తోంది. మద్దతుగా పెద్ద ఎత్తున ట్వీట్లు పడుతున్నాయి. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యను నీరుగార్చేందుకు పోలీసులు బాలీవుడ్ ప్రముఖులతో కలిసి కుమ్మక్కవుతున్నారంటూ సుశాంత్ ఫ్యాన్స్ ఆరోపిస్తూ ట్వీట్లు వేస్తున్నారు.
This post was last modified on June 22, 2020 11:52 pm
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…