బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తాలూకు మంటలు ఇంకా చల్లారలేదు. వారం తర్వాత కూడా అతడి అభిమానులు, మద్దతుదారులు శాంతించడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా అనేక హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సుశాంత్ తనకు తానుగా ఆత్మహత్యకు పాల్పడలేదని.. ఇది పరోక్షంగా హత్య లాంటిదే అని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు. బాలీవుడ్ మూవీ మాఫియా అతణ్ని టార్గెట్ చేసి చంపేసిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్లతో పాటు బాలీవుడ్ బడాబాబులను, వారసత్వం ద్వారా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లను టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్.
సుశాంత్ నెపోటిజం మీద పోరాడిన ధీరుడని అంటున్న అతడి మద్దతుదారులు.. అతను చనిపోయిన జూన్ 14వ తేదీని వరల్డ్ యాంటీ నెపోటిజం డేగా ప్రకటించడం విశేషం. సుశాంత్ బాలీవుడ్లో చాలామందిలా వారసత్వంతో హీరో కాలేదని.. సొంత ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగాడని.. స్టార్ ఇమేజ్ సంపాదించాడని.. అతను నెపోటిజం మీద విజయం సాధించాడని.. కానీ చివరికి ఈ స్టార్ కిడ్స్, వాళ్లను ప్రమోట్ చేసే వాళ్ల వల్లే ప్రాణాలు కోల్పోయాడని.. అందుకే జూన్ 14వ తేదీని వరల్డ్ యాంటీ నెపోటిజం డేగా ప్రకటిస్తున్నామని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో మంచి స్పందనే వస్తోంది. మద్దతుగా పెద్ద ఎత్తున ట్వీట్లు పడుతున్నాయి. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యను నీరుగార్చేందుకు పోలీసులు బాలీవుడ్ ప్రముఖులతో కలిసి కుమ్మక్కవుతున్నారంటూ సుశాంత్ ఫ్యాన్స్ ఆరోపిస్తూ ట్వీట్లు వేస్తున్నారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…