ఒకప్పుడు సౌత్ ఇండియాలో తమిళ చిత్రాల ఆధిపత్యం ఎలా సాగిందో తెలిసిందే. ముందుగా కమల్ హాసన్, ఆ తర్వాత రజినీకాంత్ తెలుగులో భారీ విజయాలందుకున్నారు. ఆ తర్వాత సూర్య, విశాల్, కార్తి, జీవా లాంటి హీరోలు కూడా ఇక్కడ ఆధిపత్యం చలాయించారు. ఒక టైంలో తమిళ అనువాద చిత్రాలకు భయపడి మన చిత్రాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు ఆ ట్రెండును తమిళ హీరోలు, దర్శకులు, నిర్మాతలు బాగా ఎంజాయ్ చేశారు.
ఇక్కడ మార్కెట్ ఇంకా ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఐతే తమిళ చిత్రాలు టాప్ లెవెల్లో ఉన్నంత కాలం.. అక్కడి ప్రేక్షకులు వేరే భాషా చిత్రాలను తమిళంలోకి రానివ్వలేదు. డబ్బింగ్ సినిమాలేవీ అక్కడ ఆడేవి కావు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. తమిళ చిత్రాల క్వాలిటీ పడిపోయింది. అదే సమయంలో తెలుగు సినిమాల జోరు పెరిగింది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు తమిళనాట బాక్సాఫీస్ను షేక్ చేశాయి.
ఇప్పుడు కన్నడ అనువాద చిత్రం ‘కేజీఎఫ్-2’ కోలీవుడ్ బాక్సాఫీస్లో ప్రకంపనలు రేపింది. దీని ధాటికి విజయ్ లాంటి టాప్ స్టార్ సినిమా ‘బీస్ట్’ కుదేలైంది. ‘బీస్ట్’ సినిమాను తొలి వీకెండ్లోనే ‘కేజీఎఫ్-2’తో రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వీకెండ్ తర్వాత విజయ్ సినిమా పూర్తిగా చతికిలపడింది. ఐతే ఈ పరిణామం తమిళ ఇండస్ట్రీ జనాలకు రుచించడం లేదు. మన సినిమాల మీద వేరే చిత్రాల పెత్తనం ఏంటి అంటూ ఉడికిపోతున్నారు. కొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్త పరిచారు కూడా.
ఐతే అలాంటి వాళ్లకు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సున్నితంగానే గడ్డి పెట్టారు. ఒక భాషకు చెందిన సినిమా ఇంకో భాషలో ఆడటం కొత్త కాదని.. తమిళనాట కూడా వేరే భాషా చిత్రాలను ఆదరించడం 70-80 ఏళ్ల కిందటే జరిగిందని, ఇదేమీ కొత్త కాదని.. మన సినిమాలు కూడా వేరే భాషల్లో బాగా ఆడాయని.. ‘కేజీఎఫ్-2’కు తమిళంలో ఆదరణ దక్కడం మంచి విషయమే అని మణిరత్నం వ్యాఖ్యానించారు. తమిళంలో గొప్ప టాలెంట్ ఉందని, వారిపై తనకు నమ్మకం ఉందని, తమిళ సినిమాను వారు ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on April 27, 2022 4:25 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…