సుమంత్ అనే ఫాంలో లేని హీరోతో తక్కువ బడ్జెట్లో ‘మళ్ళీ రావా’ అనే సినిమా తీసి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలన్నట్లు.. ఆ సినిమా చూసి గౌతమ్ ప్రతిభ ఏంటో అందరూ అర్థం చేసుకున్నారు. నేచురల్ స్టార్ నాని లాంటి పేరున్న హీరోతో.. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో తన రెండో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు గౌతమ్.
ఈ కాంబినేషన్లో వచ్చిన ‘జెర్సీ’కి ఎన్ని ప్రశంసలు వచ్చాయో తెలిసిందే. కమర్షియల్గా ఓ మోస్తరు విజయాన్నే అందుకున్నప్పటికీ.. తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఇదే అనే స్థాయిలో ‘జెర్సీ’కి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం వెంటనే బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. షాహిద్ కపూర్ లాంటి పెద్ద హీరోతో గౌతమ్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే అవకాశం అందుకున్నాడు. అక్కడా ‘జెర్సీ’ పేరుతోనే సినిమా పునర్నిర్మితమైంది. కరోనా, ఇతర కారణాలతో రిలీజ్ చాలా ఆలస్యమైది కానీ.. ‘జెర్సీ’ ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం అనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో ఉంది.
‘కేజీఎఫ్-2’ దూకుడు కొనసాగుతున్నప్పటికీ ఈ శుక్రవారం ‘జెర్సీ’ని ధైర్యంగా రిలీజ్ చేసేశారు. విడుదల ముంగిట ఈ చిత్రానికి సెలబ్రెటీలతో స్పెషల్ ప్రిమియర్స్ వేశారు ముంబయిలో. అందులో సినిమా చూసిన వాళ్లందరూ ముగ్ధులైపోయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది సినిమాను కొనియాడుతూ.. గౌతమ్, షాహిద్లపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు వేస్తున్నారు. ఇవేమీ బలవంతపు, మొక్కుబడి ట్వీట్లలా లేవు.
అందరూ మనస్ఫూర్తిగానే అభినందనలు తెలియజేస్తున్నట్లున్నారు. కాగా ఈ ప్రిమియర్ వేసిన థియేటర్లో షో అయ్యాక తీసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రోలింగ్ టైటిల్స్ పడేటపుడు గౌతమ్కు ఆడియన్స్ అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం, అతడిని ప్రశంసల్లో ముంచెత్తడం విశేషం. చూస్తుంటే బాలీవుడ్లో అరంగేట్రంలోనే గౌతమ్ హాట్ టాపిక్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే ‘కేజీఎఫ్-2’ ప్రభంజనాన్ని తట్టుకుని బాక్సాపీస్ దగ్గర ఈ చిత్రం ఎలాంటి ఫలితం రాబడుతుందన్నదే కీలకం.
This post was last modified on April 22, 2022 3:54 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…