Movie News

ఆచార్య కోసం పవన్, రాజమౌళి?

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఇటీవల సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ముందుగా ఈ ఈవెంట్‌ను విజయవాడలో చేయబోతున్నారని, దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతున్నారని ప్రచారం జరిగింది. ఇది మెగా అభిమానులకే మింగుడు పడలేదు. ఓవైపు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం మీద రాజకీయంగా పోరాడుతుంటే.. మరోవైపు ఆయన అన్నయ్య జగన్‌తో సన్నిహితంగా మెలిగితే జనసేనానికి ఇబ్బంది కదా అనే చర్చ నడిచింది.

ఐతే మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఎంత వరకు నిజమో ఏమో కానీ.. తర్వాత అయితే ఇది జరగడం లేదని తేలింది. జనాల స్పందన చూశాక వెనక్కి తగ్గారో, లేక ముందు నుంచే ఆ ఆలోచన లేదో తెలియదు కానీ.. ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక అయితే మారిపోయింది. హైదరాబాద్‌లోనే ఈ వేడుక చేయడానికి నిర్ణయించారు. ఇప్పుడిక ‘ఆచార్య’ ఈవెంట్‌కు ముఖ్య అతిథులు ఎవరన్న విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది.

తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌నే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పిలవాలని చిరు నిర్ణయించుకున్నారట. చిరు-చరణ్ కలిసి నటిస్తున్న తొలి పూర్తి స్థాయి చిత్రమిదే. ఇలాంటి సినిమా వేడుకలో పవన్ పాల్గొంటే బాగుంటుందని చిరు భావించినట్లున్నారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి తెలుగు సినిమా పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేసిన దర్శక ధీరుడు రాజమౌళి కూడా మరో అతిథిగా వస్తారని సమాచారం.

ఈ మేరకు ఇప్పుడు జోరుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముంది. ఈ నెల 29న ‘ఆచార్య’ రిలీజ్ కాబోతుండగా.. దానికి ఆరు రోజుల ముందు, అంటే 23న ఈ ఈవెంట్ చేయబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు, చరణ్‌లకు జోడీగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే.

This post was last modified on April 19, 2022 5:57 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

2 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

2 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

3 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

3 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

4 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

4 hours ago