Movie News

ఆచార్య కోసం పవన్, రాజమౌళి?

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఇటీవల సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ముందుగా ఈ ఈవెంట్‌ను విజయవాడలో చేయబోతున్నారని, దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతున్నారని ప్రచారం జరిగింది. ఇది మెగా అభిమానులకే మింగుడు పడలేదు. ఓవైపు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం మీద రాజకీయంగా పోరాడుతుంటే.. మరోవైపు ఆయన అన్నయ్య జగన్‌తో సన్నిహితంగా మెలిగితే జనసేనానికి ఇబ్బంది కదా అనే చర్చ నడిచింది.

ఐతే మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఎంత వరకు నిజమో ఏమో కానీ.. తర్వాత అయితే ఇది జరగడం లేదని తేలింది. జనాల స్పందన చూశాక వెనక్కి తగ్గారో, లేక ముందు నుంచే ఆ ఆలోచన లేదో తెలియదు కానీ.. ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక అయితే మారిపోయింది. హైదరాబాద్‌లోనే ఈ వేడుక చేయడానికి నిర్ణయించారు. ఇప్పుడిక ‘ఆచార్య’ ఈవెంట్‌కు ముఖ్య అతిథులు ఎవరన్న విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది.

తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌నే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పిలవాలని చిరు నిర్ణయించుకున్నారట. చిరు-చరణ్ కలిసి నటిస్తున్న తొలి పూర్తి స్థాయి చిత్రమిదే. ఇలాంటి సినిమా వేడుకలో పవన్ పాల్గొంటే బాగుంటుందని చిరు భావించినట్లున్నారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి తెలుగు సినిమా పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేసిన దర్శక ధీరుడు రాజమౌళి కూడా మరో అతిథిగా వస్తారని సమాచారం.

ఈ మేరకు ఇప్పుడు జోరుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముంది. ఈ నెల 29న ‘ఆచార్య’ రిలీజ్ కాబోతుండగా.. దానికి ఆరు రోజుల ముందు, అంటే 23న ఈ ఈవెంట్ చేయబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు, చరణ్‌లకు జోడీగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago