మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్కు సంబంధించి ఇటీవల సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ముందుగా ఈ ఈవెంట్ను విజయవాడలో చేయబోతున్నారని, దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతున్నారని ప్రచారం జరిగింది. ఇది మెగా అభిమానులకే మింగుడు పడలేదు. ఓవైపు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం మీద రాజకీయంగా పోరాడుతుంటే.. మరోవైపు ఆయన అన్నయ్య జగన్తో సన్నిహితంగా మెలిగితే జనసేనానికి ఇబ్బంది కదా అనే చర్చ నడిచింది.
ఐతే మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఎంత వరకు నిజమో ఏమో కానీ.. తర్వాత అయితే ఇది జరగడం లేదని తేలింది. జనాల స్పందన చూశాక వెనక్కి తగ్గారో, లేక ముందు నుంచే ఆ ఆలోచన లేదో తెలియదు కానీ.. ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక అయితే మారిపోయింది. హైదరాబాద్లోనే ఈ వేడుక చేయడానికి నిర్ణయించారు. ఇప్పుడిక ‘ఆచార్య’ ఈవెంట్కు ముఖ్య అతిథులు ఎవరన్న విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది.
తన తమ్ముడు పవన్ కళ్యాణ్నే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పిలవాలని చిరు నిర్ణయించుకున్నారట. చిరు-చరణ్ కలిసి నటిస్తున్న తొలి పూర్తి స్థాయి చిత్రమిదే. ఇలాంటి సినిమా వేడుకలో పవన్ పాల్గొంటే బాగుంటుందని చిరు భావించినట్లున్నారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి తెలుగు సినిమా పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేసిన దర్శక ధీరుడు రాజమౌళి కూడా మరో అతిథిగా వస్తారని సమాచారం.
ఈ మేరకు ఇప్పుడు జోరుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముంది. ఈ నెల 29న ‘ఆచార్య’ రిలీజ్ కాబోతుండగా.. దానికి ఆరు రోజుల ముందు, అంటే 23న ఈ ఈవెంట్ చేయబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు, చరణ్లకు జోడీగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే.
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…