జెంటిల్మ్యాన్.. 90వ దశకంలో దక్షిణాదిన సంచలనం రేపిన సినిమా. అర్జున్ కథానాయకుడిగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయి శంకర్ పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడా సూపర్ హిట్టయింది. తర్వాత అది చిరంజీవి హీరోగా బాలీవుడ్లోనూ రీమేక్ అయి అక్కడా బాగానే ఆడింది. ఆ తర్వాత శంకర్ ఎలా ఎదిగాడో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మించిన కేటీ కుంజుమోన్ కూడా చాలా పెద్ద రేంజికి వెళ్లాడు. ఆ తర్వాత మరెన్ని భారీ చిత్రాలను రూపొందించాడు.
ఐతే ‘రక్షకుడు’ సినిమాకు నేలవిడిచి సాము చేయడంతో ఆయన నిర్మాణ సంస్థకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాన్నుంచి ఆయన కోలుకోలేక ఒక దశ దాటాక ప్రొడక్షనే ఆపేశాడు. ఐతే చాలా ఏళ్ల పాటు మౌనంగా ఉన్న కుంజుమోన్.. ఈ మధ్య మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ‘జెంటిల్మ్యాన్-2’ తీయబోతున్నట్లు ప్రకటించాడు.
ముందుగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి ఎంపికైనట్లు ప్రకటించడంతో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు కుంజుమోన్. ఐతే ఈ సినిమాకు ఎవరు సంగీతం అందిస్తే ఏంటి.. అసలు హీరో ఎవరు, దర్శకుడెవరు అన్న ప్రశ్నలు ప్రేక్షకుల నుంచి ఎదురయ్యాయి. కానీ ఆయన వాటికి సమాధానం ఇవ్వలేదు. తర్వాతేమో ఈ చిత్రంలో నయనతార ఓ కథానాయిక అన్నాడు. తర్వాతైనా హీరో, డైరెక్టర్ గురించి చెబుతాడనుకుంటే అదీ జరగలేదు. ఇప్పుడేమో ఈ చిత్రంలో ప్రియా లాల్ అనే కొత్తమ్మాయి ఇంకో హీరోయిన్గా నటిస్తుందని ప్రకటించాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ ఈ అప్డేట్లేవీ కూడా ప్రేక్షకులను ఎగ్జైట్ చేయట్లేదు.
ఒక బ్లాక్బస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే ముందు అదే హీరో చేస్తాడా.. అదే దర్శకుడు రూపొందిస్తాడా అనే చూస్తారు జనాలు. వేరే వాళ్లు ఎవరైనా టేకప్ చేసినా.. వాళ్లూ పేరున్న వాళ్లే అయ్యుండాలి. అప్పుడే సీక్వెల్కు క్రేజ్ వస్తుంది. ఆ సంగతేంటో తేల్చకుండా సంగీత దర్శకుడు, హీరోయిన్లను ప్రకటించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఇదంతా ఒక తమాషాలాగా అనిపిస్తోంది జనాలకు. మరి కుంజుమోన్ అసలు విషయాలు ఎప్పుడు వెల్లడిస్తాడో?
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…