జెంటిల్మ్యాన్.. 90వ దశకంలో దక్షిణాదిన సంచలనం రేపిన సినిమా. అర్జున్ కథానాయకుడిగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయి శంకర్ పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడా సూపర్ హిట్టయింది. తర్వాత అది చిరంజీవి హీరోగా బాలీవుడ్లోనూ రీమేక్ అయి అక్కడా బాగానే ఆడింది. ఆ తర్వాత శంకర్ ఎలా ఎదిగాడో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మించిన కేటీ కుంజుమోన్ కూడా చాలా పెద్ద రేంజికి వెళ్లాడు. ఆ తర్వాత మరెన్ని భారీ చిత్రాలను రూపొందించాడు.
ఐతే ‘రక్షకుడు’ సినిమాకు నేలవిడిచి సాము చేయడంతో ఆయన నిర్మాణ సంస్థకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాన్నుంచి ఆయన కోలుకోలేక ఒక దశ దాటాక ప్రొడక్షనే ఆపేశాడు. ఐతే చాలా ఏళ్ల పాటు మౌనంగా ఉన్న కుంజుమోన్.. ఈ మధ్య మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ‘జెంటిల్మ్యాన్-2’ తీయబోతున్నట్లు ప్రకటించాడు.
ముందుగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి ఎంపికైనట్లు ప్రకటించడంతో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు కుంజుమోన్. ఐతే ఈ సినిమాకు ఎవరు సంగీతం అందిస్తే ఏంటి.. అసలు హీరో ఎవరు, దర్శకుడెవరు అన్న ప్రశ్నలు ప్రేక్షకుల నుంచి ఎదురయ్యాయి. కానీ ఆయన వాటికి సమాధానం ఇవ్వలేదు. తర్వాతేమో ఈ చిత్రంలో నయనతార ఓ కథానాయిక అన్నాడు. తర్వాతైనా హీరో, డైరెక్టర్ గురించి చెబుతాడనుకుంటే అదీ జరగలేదు. ఇప్పుడేమో ఈ చిత్రంలో ప్రియా లాల్ అనే కొత్తమ్మాయి ఇంకో హీరోయిన్గా నటిస్తుందని ప్రకటించాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ ఈ అప్డేట్లేవీ కూడా ప్రేక్షకులను ఎగ్జైట్ చేయట్లేదు.
ఒక బ్లాక్బస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే ముందు అదే హీరో చేస్తాడా.. అదే దర్శకుడు రూపొందిస్తాడా అనే చూస్తారు జనాలు. వేరే వాళ్లు ఎవరైనా టేకప్ చేసినా.. వాళ్లూ పేరున్న వాళ్లే అయ్యుండాలి. అప్పుడే సీక్వెల్కు క్రేజ్ వస్తుంది. ఆ సంగతేంటో తేల్చకుండా సంగీత దర్శకుడు, హీరోయిన్లను ప్రకటించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఇదంతా ఒక తమాషాలాగా అనిపిస్తోంది జనాలకు. మరి కుంజుమోన్ అసలు విషయాలు ఎప్పుడు వెల్లడిస్తాడో?
This post was last modified on April 14, 2022 10:21 pm
రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…
మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత…
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…