పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే బేసిగ్గా పవన్కు ఉండే క్రేజే ఆయన సినిమాలకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చేస్తుంటుంది. అలాంటిది పవన్ మిగతా హీరోల్లాగా తన చిత్రాలను ప్రమోట్ చేస్తే.. ఎప్పటికప్పుడు అభిమానులకు పవన్ సినిమాల అప్డేట్స్ ఇస్తూ, మేకింగ్ వీడియోల్లాంటివి వదులుతూ ఊరిస్తుంటే ఇక ఆ సినిమాకు ఎంత హైప్ వస్తుందో చెప్పేదేముంది? ఇన్నాళ్లూ చూడని ఈ చిత్రమే ఇప్పుడు చూస్తున్నారు అభిమానులు.
ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా బాగా వెనుకబడ్డ హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు ఉన్నట్లుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాహుబలి తరహా భారీ కథాంశంతోనే సినిమా తెరకెక్కుతున్నప్పటికీ.. ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలపకపోవడం వల్ల అనుకున్నంత హైప్ రాలేదు. ఏడాది కిందట ఒక టీజర్ వదిలారు. ఆ తర్వాత ఏ ముచ్చటా లేదు.
అసలు షూటింగ్ గురించి కూడా సమాచారం లేదు. ఐతే చాన్నాళ్ల విరామం తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతూ.. లొకేషన్లో పవన్ ట్రైన్ అవుతున్న ఫొటోలు కొన్ని వదిలిన టీం.. ఈ ప్రిపరేషన్ తాలూకు వీడియో ఒకటి వదిలింది. అది కాసేపటికే సోషల్ మీడియాను షేక్ చేసేసింది. సినిమా మీద ఉన్నట్లుండి హైప్ పెరిగిపోయేలా చేసింది. ఈ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వచ్చేశాయి. ఒకప్పుడు యాక్షన్ సన్నివేశాల మీద పవన్ చాలా ఫోకస్ పెట్టేవాడు.
వాటి కోసం ఎంతో కష్టపడేవాడు. గత కొన్నేళ్లలో కథ మారిపోయింది. ఏదో మొక్కుబడిగా షూటింగ్కు వచ్చి వెళ్తున్నట్లే కనిపిస్తోంది. ప్రిపరేషన్లు గట్రా ఏమీ ఉండట్లేదు. యాక్షన్ ఘట్టాల మీద శ్రద్ధ కనిపించలేదు. కానీ హరిహర వీరమల్లు కోసం మాత్రం ఒకప్పటి స్థాయిలో కష్టపడి యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా వచ్చేలా చూస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ప్రమోషన్ల మీద కూడా టీం ఫోకస్ పెట్టడంతో సినిమాకు మంచి హైప్ వచ్చేలా కనిపిస్తోంది.
This post was last modified on April 10, 2022 11:30 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…