పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే బేసిగ్గా పవన్కు ఉండే క్రేజే ఆయన సినిమాలకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చేస్తుంటుంది. అలాంటిది పవన్ మిగతా హీరోల్లాగా తన చిత్రాలను ప్రమోట్ చేస్తే.. ఎప్పటికప్పుడు అభిమానులకు పవన్ సినిమాల అప్డేట్స్ ఇస్తూ, మేకింగ్ వీడియోల్లాంటివి వదులుతూ ఊరిస్తుంటే ఇక ఆ సినిమాకు ఎంత హైప్ వస్తుందో చెప్పేదేముంది? ఇన్నాళ్లూ చూడని ఈ చిత్రమే ఇప్పుడు చూస్తున్నారు అభిమానులు.
ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా బాగా వెనుకబడ్డ హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు ఉన్నట్లుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాహుబలి తరహా భారీ కథాంశంతోనే సినిమా తెరకెక్కుతున్నప్పటికీ.. ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలపకపోవడం వల్ల అనుకున్నంత హైప్ రాలేదు. ఏడాది కిందట ఒక టీజర్ వదిలారు. ఆ తర్వాత ఏ ముచ్చటా లేదు.
అసలు షూటింగ్ గురించి కూడా సమాచారం లేదు. ఐతే చాన్నాళ్ల విరామం తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతూ.. లొకేషన్లో పవన్ ట్రైన్ అవుతున్న ఫొటోలు కొన్ని వదిలిన టీం.. ఈ ప్రిపరేషన్ తాలూకు వీడియో ఒకటి వదిలింది. అది కాసేపటికే సోషల్ మీడియాను షేక్ చేసేసింది. సినిమా మీద ఉన్నట్లుండి హైప్ పెరిగిపోయేలా చేసింది. ఈ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వచ్చేశాయి. ఒకప్పుడు యాక్షన్ సన్నివేశాల మీద పవన్ చాలా ఫోకస్ పెట్టేవాడు.
వాటి కోసం ఎంతో కష్టపడేవాడు. గత కొన్నేళ్లలో కథ మారిపోయింది. ఏదో మొక్కుబడిగా షూటింగ్కు వచ్చి వెళ్తున్నట్లే కనిపిస్తోంది. ప్రిపరేషన్లు గట్రా ఏమీ ఉండట్లేదు. యాక్షన్ ఘట్టాల మీద శ్రద్ధ కనిపించలేదు. కానీ హరిహర వీరమల్లు కోసం మాత్రం ఒకప్పటి స్థాయిలో కష్టపడి యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా వచ్చేలా చూస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ప్రమోషన్ల మీద కూడా టీం ఫోకస్ పెట్టడంతో సినిమాకు మంచి హైప్ వచ్చేలా కనిపిస్తోంది.
This post was last modified on April 10, 2022 11:30 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…