పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే బేసిగ్గా పవన్కు ఉండే క్రేజే ఆయన సినిమాలకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చేస్తుంటుంది. అలాంటిది పవన్ మిగతా హీరోల్లాగా తన చిత్రాలను ప్రమోట్ చేస్తే.. ఎప్పటికప్పుడు అభిమానులకు పవన్ సినిమాల అప్డేట్స్ ఇస్తూ, మేకింగ్ వీడియోల్లాంటివి వదులుతూ ఊరిస్తుంటే ఇక ఆ సినిమాకు ఎంత హైప్ వస్తుందో చెప్పేదేముంది? ఇన్నాళ్లూ చూడని ఈ చిత్రమే ఇప్పుడు చూస్తున్నారు అభిమానులు.
ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా బాగా వెనుకబడ్డ హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు ఉన్నట్లుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాహుబలి తరహా భారీ కథాంశంతోనే సినిమా తెరకెక్కుతున్నప్పటికీ.. ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలపకపోవడం వల్ల అనుకున్నంత హైప్ రాలేదు. ఏడాది కిందట ఒక టీజర్ వదిలారు. ఆ తర్వాత ఏ ముచ్చటా లేదు.
అసలు షూటింగ్ గురించి కూడా సమాచారం లేదు. ఐతే చాన్నాళ్ల విరామం తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతూ.. లొకేషన్లో పవన్ ట్రైన్ అవుతున్న ఫొటోలు కొన్ని వదిలిన టీం.. ఈ ప్రిపరేషన్ తాలూకు వీడియో ఒకటి వదిలింది. అది కాసేపటికే సోషల్ మీడియాను షేక్ చేసేసింది. సినిమా మీద ఉన్నట్లుండి హైప్ పెరిగిపోయేలా చేసింది. ఈ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వచ్చేశాయి. ఒకప్పుడు యాక్షన్ సన్నివేశాల మీద పవన్ చాలా ఫోకస్ పెట్టేవాడు.
వాటి కోసం ఎంతో కష్టపడేవాడు. గత కొన్నేళ్లలో కథ మారిపోయింది. ఏదో మొక్కుబడిగా షూటింగ్కు వచ్చి వెళ్తున్నట్లే కనిపిస్తోంది. ప్రిపరేషన్లు గట్రా ఏమీ ఉండట్లేదు. యాక్షన్ ఘట్టాల మీద శ్రద్ధ కనిపించలేదు. కానీ హరిహర వీరమల్లు కోసం మాత్రం ఒకప్పటి స్థాయిలో కష్టపడి యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా వచ్చేలా చూస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ప్రమోషన్ల మీద కూడా టీం ఫోకస్ పెట్టడంతో సినిమాకు మంచి హైప్ వచ్చేలా కనిపిస్తోంది.
This post was last modified on April 10, 2022 11:30 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…