ఉపేంద్ర.. ఈ పేరు వింటే ఒకప్పుడు తెలుగు యువత వెర్రెత్తిపోయేది. ఎ, ఉపేంద్ర లాంటి చిత్రాలతో 90వ దశకంలో అతను మామూలు సంచలనం రేపలేదు. ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా యువతలో ఆదరణ సంపాదించుకున్నాడు. ఈ డబ్బింగ్ చిత్రాల తర్వాత తెలుగులో నేరుగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. అవి అంత బాగా ఏమీ ఆడకపోవడంతో తెలుగు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు.
ఉపేంద్ర డబ్బింగ్ సినిమాల జోరు కూడా తగ్గింది. సూపర్ అనే ఒక సినిమా మినహాయిస్తే ఇంకేదీ తెలుగులో ఆడలేదు. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఉపేంద్ర తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తితో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రంలో కీలక పాత్ర చేసిన అతడికి సరైన ఫలితం దక్కలేదు. ఆ సినిమానే కాక, ఉపేంద్ర పాత్ర కూడా ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో మెప్పంచలేకపోయింది. దీంతో మళ్లీ బ్రేక్ వచ్చింది.
మళ్లీ ఇన్నేళ్లకు గని సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేశాడు.
విక్రమాదిత్య అనే హీరో తండ్రి పాత్ర అతడిది. లేక లేక ఉపేంద్ర తెలుగులో ఓ సినిమా చేయడంతో కచ్చితంగా అది చాలా స్పెషల్ అయ్యుంటుందని అనుకున్నారంతా. కానీ శుక్రవారం రిలీజైన ఈ సినిమా చూసిన వాళ్లంతా ఉసూరుమన్నారు. సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోగా.. ఉపేంద్ర పాత్ర మరీ పేలవంగా తయారైంది.
ఫ్లాష్ బ్యాక్లో 20 నిమిషాల పైనే ఈ పాత్ర ఉంటుంది కానీ.. ఒక్కసారి కూడా హుషారు పుట్టించదు. ఫ్లాష్ బ్యాక్ మొదలవడానికి ముందు ఈ పాత్రకు పెద్ద బిల్డప్ ఇస్తారు కానీ.. తీరా చూస్తే ఆ పాత్ర తేలిపోయింది. నీరసం తెప్పించే ఫ్లాష్ బ్యాక్లో రొటీన్గా సాగే ఉపేంద్ర పాత్ర ఏమాత్రం ఆకట్టుకోదు. చాలా ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఉపేంద్రను ఇలాంటి పాత్రలో చూపించాలన్న ఆలోచన ఎలా కలిగిందో ఏమో మరి. దీంతో పోలిస్తే సన్నాఫ్ సత్యమూర్తిలో చేసిన పాత్ర ఎంతో బెటర్. ఇకపై తెలుగులో ఎవరైనా పాత్ర ఆఫర్ చేస్తే ఉపేంద్ర కూడా కాస్త ఆలోచించి చేయడం మంచిది.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…