పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో.. ఎవరితో జట్టు కడతాడో తెలియని అయోమయంలో ఉన్నారు అభిమానులు. ఒక సినిమా మొదలు మధ్యలో ఇంకో సినిమాను తెరపైకి తేవడం.. దాన్ని పూర్తి చేసి రిలీజ్ చేయడం.. ముందు ప్రకటించిన సినిమాలను ఎటూ కాకుండా వదిలేయడం.. ఇలా నడుస్తోంది వ్యవహారం.
వకీల్ సాబ్ తర్వాత నిజానికి హరిహర వీరమల్లు సినిమా పూర్తవ్వాలి. ఆ తర్వాత భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాలి. కానీ మధ్యలోకి భీమ్లా నాయక్ వచ్చింది. హరిహర వీరమల్లు మధ్యలో ఆగింది. భవదీయుడు భగత్ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. భీమ్లా నాయక్ అయ్యాక అయినా ఆ రెండు చిత్రాల సంగతి తేలుస్తాడేమో అనుకుంటే.. వినోదియ సిత్తం అనే తమిళ సినిమా రీమేక్లో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే.
ఆ సినిమా అతి త్వరలో మొదలవుతుందని అన్నారు కానీ.. ప్రస్తుతానికి అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. కాగా ఇప్పుడు పవన్ కొత్త ప్రాజెక్టు గురించి మరో కొత్త కబురు వినిపిస్తోంది. నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం చిత్రాల దర్శకుడు వేణు ఉడుగులతో పవన్ జట్టు కట్టబోతున్నట్లు చెబుతున్నారు. తన తొలి చిత్రం రిలీజైన మంచి పేరు తెచ్చుకున్నప్పుడే పవన్ మీద తన అభిమానాన్ని చాటుకుంటూ ఆయనతో ఎప్పటికైనా సినిమా తీస్తానని అన్నాడు వేణు. సమాజం పట్ల మంచి అవగాహన, గొప్ప భావజాలం ఉన్న వ్యక్తిలా కనిపించే వేణు.. పవన్తో మంచి ఇంటెన్సిటీ ఉన్న సినిమా తీస్తే బాగానే ఉండొచ్చు.
కానీ ఇప్పుడున్న లైనప్లో పవన్ అతడికి ఛాన్స్ ఎలా ఇస్తాడన్నది ప్రశ్నార్థకం. అసలే పూర్తి స్థాయి రాజకీయాలు చేయట్లేదనే విమర్శలున్నాయి పవన్ మీద. సాధ్యమైనంత త్వరగా చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఫుల్ టైం రాజకీయాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటుంటే ఎప్పటికప్పుడు ఇలా కొత్త సినిమాలను లైన్లోకి తేవడమేంటో అర్థం కావడం లేదు.
This post was last modified on April 1, 2022 11:26 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…