పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో.. ఎవరితో జట్టు కడతాడో తెలియని అయోమయంలో ఉన్నారు అభిమానులు. ఒక సినిమా మొదలు మధ్యలో ఇంకో సినిమాను తెరపైకి తేవడం.. దాన్ని పూర్తి చేసి రిలీజ్ చేయడం.. ముందు ప్రకటించిన సినిమాలను ఎటూ కాకుండా వదిలేయడం.. ఇలా నడుస్తోంది వ్యవహారం.
వకీల్ సాబ్ తర్వాత నిజానికి హరిహర వీరమల్లు సినిమా పూర్తవ్వాలి. ఆ తర్వాత భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాలి. కానీ మధ్యలోకి భీమ్లా నాయక్ వచ్చింది. హరిహర వీరమల్లు మధ్యలో ఆగింది. భవదీయుడు భగత్ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. భీమ్లా నాయక్ అయ్యాక అయినా ఆ రెండు చిత్రాల సంగతి తేలుస్తాడేమో అనుకుంటే.. వినోదియ సిత్తం అనే తమిళ సినిమా రీమేక్లో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే.
ఆ సినిమా అతి త్వరలో మొదలవుతుందని అన్నారు కానీ.. ప్రస్తుతానికి అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. కాగా ఇప్పుడు పవన్ కొత్త ప్రాజెక్టు గురించి మరో కొత్త కబురు వినిపిస్తోంది. నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం చిత్రాల దర్శకుడు వేణు ఉడుగులతో పవన్ జట్టు కట్టబోతున్నట్లు చెబుతున్నారు. తన తొలి చిత్రం రిలీజైన మంచి పేరు తెచ్చుకున్నప్పుడే పవన్ మీద తన అభిమానాన్ని చాటుకుంటూ ఆయనతో ఎప్పటికైనా సినిమా తీస్తానని అన్నాడు వేణు. సమాజం పట్ల మంచి అవగాహన, గొప్ప భావజాలం ఉన్న వ్యక్తిలా కనిపించే వేణు.. పవన్తో మంచి ఇంటెన్సిటీ ఉన్న సినిమా తీస్తే బాగానే ఉండొచ్చు.
కానీ ఇప్పుడున్న లైనప్లో పవన్ అతడికి ఛాన్స్ ఎలా ఇస్తాడన్నది ప్రశ్నార్థకం. అసలే పూర్తి స్థాయి రాజకీయాలు చేయట్లేదనే విమర్శలున్నాయి పవన్ మీద. సాధ్యమైనంత త్వరగా చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఫుల్ టైం రాజకీయాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటుంటే ఎప్పటికప్పుడు ఇలా కొత్త సినిమాలను లైన్లోకి తేవడమేంటో అర్థం కావడం లేదు.
This post was last modified on April 1, 2022 11:26 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…