మిషన్ ఇంపాజిబుల్.. ఈ వారం రిలీజవుతున్న చిన్న సినిమా. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రం వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తున్న సమయంలో ఇలాంటి చిన్న సినిమాను థియేటర్లకు దించడం అంటే సాహసమనే చెప్పాలి. ఇంకే చెప్పుకోదగ్గ సినిమా కూడా ఈ వారం విడుదల కావట్లేదు. ఎవరూ అంత ధైర్యం చేయట్లేదు.
కానీ ఖాళీ దొరికిందనో.. సినిమా మీద నమ్మకమో గానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ మేకర్స్ తమ చిత్రాన్ని ముందు ప్రకటించినట్లే ఏప్రిల్ 1నే థియేటర్లలోకి తెచ్చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ట్రైలర్లలో ‘మిషన్ ఇంపాజిబుల్’ ఒకటి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు వేయించుకున్నాడు స్వరూప్. అలాంటి హిట్ తర్వాత అతను ప్రయత్నిస్తే మీడియం రేంజి హీరోల్లో ఎవరో ఒకరు దొరికేవాళ్లు. కానీ స్వరూప్ మాత్రం ముగ్గురు చిన్నపిల్లల్ని ప్రధాన పాత్రలకు తీసుకుని సినిమా చేశాడు.
ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న తాప్సి ఓ ముఖ్య పాత్ర చేసిందీ సినిమాలో. దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటే వచ్చే రివార్డు కోసమని ముగ్గురు పిల్లలు ఆపరేషన్కు రెడీ అయ్యే నేపథ్యంలో థ్రిల్లింగ్గా సాగే సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది ట్రైలర్లో. స్వరూప్ మరోసారి మెప్పించబోతున్నాడనే నమ్మకం కలిగించింది ట్రైలర్.
మరి ఈ మెరుపులు ట్రైలర్ వరకు పరిమితమా.. లేక సినిమాతోనూ అతను అదే స్థాయిలో మెప్పిస్తాడా అన్నది చూడాలి. ఈ నెలలోనే రాబోతున్న భారీ చిత్రం ‘ఆచార్య’ను నిర్మించిన నిరంజన్ రెడ్డి ఈ చిన్న చిత్రాన్ని నిర్మించడం విశేషం. మరి ‘ఆర్ఆర్ఆర్’ ధాటిని తట్టుకుని ‘మిషన్ ఇంపాజిబుల్’ ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది.. వారిని మెప్పిస్తుంది అన్నది చూడాలి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…