ది కశ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు భారతీయ సినీ ప్రియుల చర్చలన్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. హిందీలో తక్కువ బడ్జెట్లో వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాల మోత మోగిస్తోంది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై.. అదిరిపోయే టాక్ తెచ్చుకుని వసూళ్ల మోత మోగిస్తోంది. వారం వ్యవధిలోనే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ చిత్రం దూసుకెళ్తోంది.
ఈ చిత్రానికి అంతకంతకూ స్క్రీన్లు, వసూళ్లు పెరుగుతూ పోతున్నాయి ఈ చిత్రానికి. ఈ సినిమాతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయిపోయాడు. ఐతే కశ్మీర్ పండిట్లపై అఘాయిత్యాలను చూపించే క్రమంలో ముస్లింలను దోషులుగా చూపించడంతో అతడిపై ఓ వర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే అతడికి బెదిరింపులు కూడా వస్తున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు అతను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం వివేక్కు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు కూడా ఇలాగే కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
తమకు అనుకూలంగా సినిమాలు తీసే, మాట్లాడే వారికి మోడీ సర్కారు ఇలా అండదండలు అందిస్తోందన్న చర్చ నడుస్తోందిప్పుడు. ఐతే కంగనా వ్యవహారంతో వివేక్ ఇష్యూను పోల్చడానికి వీల్లేదు. కశ్మీర్ ఫైల్స్ వివాదాలతో కూడుకున్న సినిమా. ఓ వర్గం సినిమా పట్ల, సినిమా తీసిన వారిపై, ప్రమోట్ చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ది కశ్మీర్ ఫైల్స్ దర్శక నిర్మాత అయిన వివేక్కు వై కేటగిరీ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది
This post was last modified on March 19, 2022 9:28 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…