పెద్ద హీరోలు ఇమేజ్ ఛట్రంలో పడితే.. దాన్నుంచి బయటికి రావడం చాలా కష్టం. అభిమానులు, మాస్ ప్రేక్షకుల ఆకాంక్షలకు తగ్గట్లే కథలు ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారీ వాళ్లను మెప్పించే ప్రయత్నమే చేయాలి. ఈ క్రమంలో ఒక మూసలోకి వెళ్లిపోతుంటారు. మాస్ మసాలా సినిమాలే చేస్తూ వస్తుంటారు. వాటికే బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం కూడా వస్తుంటుంది. తమిళంలో చాలామంది స్టార్లు ఇప్పుడు ఈ మూసలోనే సాగిపోతున్నారు.
ముఖ్యంగా అజిత్ సినిమా అంటే కొత్తదనానికి ఆమడ దూరంలో ఉంటోంది. అభిమానులకు అతడి మాస్ మసాలా సినిమాలు ఓకే అనిపిస్తున్నా.. కొత్తదనం కోరుకునే వారికి నిరాశ తప్పడం లేదు. మరీ ప్రయోగాలు చేయకపోయినా.. ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేకుండానే కొంచెం కొత్త కథలు ట్రై చేయొచ్చు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు అజిత్ అలాంటి సినిమాకే రెడీ అయినట్లుగా కనిపిస్తోంది.‘వలిమై’ దర్శకుడు హెచ్.వినోద్తోనే తన కొత్త సినిమాను మొదలుపెట్టేసిన అజిత్.. దీని తర్వాత చేయబోయే సినిమాను విఘ్నేష్ శివన్ చేతుల్లో పెట్టడం విశేషం. నయనతారతో కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉంటున్న విఘ్నేష్ మొదట్నుంచి కాస్త వైవిధ్యమైన సినిమాలే తీస్తున్నాడు. అతడి సినిమాల్లో కామెడీ భలేగా ఉంటుంది. విజయ్ సేతుపతితో విఘ్నేష్ తీసిన ‘నానుం రౌడీదా’ సూపర్ ఎంటర్టైనర్గా గుర్తింపు సంపాదించుకుని బ్లాక్బస్టర్ అయింది. ఇప్పుడు అతను సేతుపతి, సమంత, నయనతార కలయికలో చేసిన సినిమా టీజర్ ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇలాంటి దర్శకుడు.. అజిత్ లాంటి హీరోతో సినిమా తీస్తాడని ఎవరూ అనుకోలేదు. ఈ కొత్త కలయికలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు సినిమాను నిర్మించబోతున్నారు. ఇందులో నయనతారే హీరోయిన్ అట. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. మరోవైపు అజిత్.. గురు, ఆకాశం నీ హద్దురా చిత్రాల దర్శకురాలు సుధ కొంగరతోనూ ఓ సినిమా చేసే అవకాశముంది.
This post was last modified on March 15, 2022 8:41 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…