టాలీవుడ్లోనే కాదు.. మొత్తంగా ఇండియన్ బాక్సాఫీస్లో మళ్లీ భారీ చిత్రాల సందడి మొదలైపోయింది. గత వారం తెలుగులో ‘భీమ్లా నాయక్’, తమిళంలో ‘వలిమై’, హిందీలో ‘గంగూబాయి కతియావాడీ’ లాంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఈ మూడూ వాటి వాటి స్థాయిలో ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇక వచ్చే వారాంతం నుంచి సినీ వినోదం మరో స్థాయికి చేరబోతోంది.
పాన్ ఇండియాలో స్థాయిలో భారీ చిత్రం అయిన ‘రాధేశ్యామ్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంకో రెండు వారాలకు దాన్ని మించిన ‘ఆర్ఆర్ఆర్’ అనే భారీ సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. ఈ రెండు చిత్రాలపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున ఈ చిత్రాలు రిలీజవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. మెజారిటీ థియేటర్లలో ఈ చిత్రాలనే నింపేయబోతున్నారు.
ఈ రెండు చిత్రాల స్థాయి, వాటిపై ఉన్న అంచనాల దృష్ట్యా రెంటి మధ్యా రెండు వారాల విరామం ఉండేలా చూసుకున్నారు. వీటి మధ్యలో ఇంకే సినిమా రిలీజ్ చేసినా అది పెద్ద రిస్కే అవుతుంది. ఐతే ఓ చిన్న సినిమా వీటి మధ్య థియేట్రికల్ రిలీజ్2కు రెడీ అవడం విశేషం. ఆ చిత్రమే.. స్టాండప్ రాహుల్. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్, తమిళ అమ్మాయి వర్ష బొల్లమ్మ జంటగా శాంటో అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది.
ఇటీవలే రిలీజైన దీని ట్రైలర్ సరదాగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల హడావుడి మధ్య ఈ చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నదే డౌట్. రెండు ఏనుగుల మధ్య చిన్న ఎలుక పిల్ల తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న తరహాలో కనిపిస్తోందీ వ్యవహారం. ఈ స్థితిలో ప్రేక్షకుల దృష్టిలో పడాలన్నా, వారిని థియేటర్లకు రప్పించాలన్నా ‘స్టాండప్ రాహుల్’కు చాలా మంచి టాక్ రావాలి. చూద్దాం ఈ చిత్ర బృందం చేస్తున్న రిస్క్ ఎంతమేర ఫలితాన్నిస్తుందో?
This post was last modified on March 6, 2022 3:24 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…