టాలీవుడ్లోనే కాదు.. మొత్తంగా ఇండియన్ బాక్సాఫీస్లో మళ్లీ భారీ చిత్రాల సందడి మొదలైపోయింది. గత వారం తెలుగులో ‘భీమ్లా నాయక్’, తమిళంలో ‘వలిమై’, హిందీలో ‘గంగూబాయి కతియావాడీ’ లాంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఈ మూడూ వాటి వాటి స్థాయిలో ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇక వచ్చే వారాంతం నుంచి సినీ వినోదం మరో స్థాయికి చేరబోతోంది.
పాన్ ఇండియాలో స్థాయిలో భారీ చిత్రం అయిన ‘రాధేశ్యామ్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంకో రెండు వారాలకు దాన్ని మించిన ‘ఆర్ఆర్ఆర్’ అనే భారీ సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. ఈ రెండు చిత్రాలపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున ఈ చిత్రాలు రిలీజవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. మెజారిటీ థియేటర్లలో ఈ చిత్రాలనే నింపేయబోతున్నారు.
ఈ రెండు చిత్రాల స్థాయి, వాటిపై ఉన్న అంచనాల దృష్ట్యా రెంటి మధ్యా రెండు వారాల విరామం ఉండేలా చూసుకున్నారు. వీటి మధ్యలో ఇంకే సినిమా రిలీజ్ చేసినా అది పెద్ద రిస్కే అవుతుంది. ఐతే ఓ చిన్న సినిమా వీటి మధ్య థియేట్రికల్ రిలీజ్2కు రెడీ అవడం విశేషం. ఆ చిత్రమే.. స్టాండప్ రాహుల్. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్, తమిళ అమ్మాయి వర్ష బొల్లమ్మ జంటగా శాంటో అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది.
ఇటీవలే రిలీజైన దీని ట్రైలర్ సరదాగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల హడావుడి మధ్య ఈ చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నదే డౌట్. రెండు ఏనుగుల మధ్య చిన్న ఎలుక పిల్ల తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న తరహాలో కనిపిస్తోందీ వ్యవహారం. ఈ స్థితిలో ప్రేక్షకుల దృష్టిలో పడాలన్నా, వారిని థియేటర్లకు రప్పించాలన్నా ‘స్టాండప్ రాహుల్’కు చాలా మంచి టాక్ రావాలి. చూద్దాం ఈ చిత్ర బృందం చేస్తున్న రిస్క్ ఎంతమేర ఫలితాన్నిస్తుందో?
This post was last modified on March 6, 2022 3:24 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…