Movie News

అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు

న‌టి సురేఖా వాణి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ్యాఖ్యాత‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. మ‌రోవైపు 18 ఏళ్ల వ‌య‌సులోనే సురేష్ తేజ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సురేఖా వాణి.. ఇరవై ఏళ్లకే ఓ బిడ్డకు తల్లి అయ్యింది.

అయితే లైఫ్ సాఫీగా సాగిపోతున్న త‌రుణంలో సురేఖ వాణికి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. 2019లో ఆమె భర్త సురేష్ తేజ ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మృతిచెందారు. ఈ విషాద ఘ‌ట‌న నుంచి తేరుకున్న సురేఖా.. కుతురు సుప్రితను చూసుకుంటూ ఆమెను హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి గ్రాండ్‌గా ప‌రిచ‌యం చేయాల‌ని చూస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇక‌పోతే గ‌త కొద్ది రోజుల నుంచీ సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కానీ, సురేఖ మాత్రం ఈ వార్త‌ల‌ను ఖండిస్తూనే వ‌స్తోంది. అయితే తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రిత.. అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేయాల‌నుందంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.

ఓ ప్ర‌ముఖ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సుప్రిత‌.. `రెండో పెళ్లి అనేది పూర్తిగా అమ్మ తీసుకునే నిర్ణయం. నాకైతే కచ్చితంగా అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది. అయితే ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది. నాన్న చనిపోయి మూడేళ్లు అవుతుంది.. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం. అమ్మ తన కెరియర్ కంటే కూడా నా కెరియర్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. 

This post was last modified on February 27, 2022 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

46 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago