పవన్ కళ్యాణ్ చిత్రం ‘భీమ్లా నాయక్’ కచ్చితంగా వాయిదా పడొచ్చన్న సంకేతాలతో వరుణ్ తేజ్ మూవీ ‘గని’ని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తెచ్చేద్దామని అనుకున్నారు దాని మేకర్స్. ఈ మేరకు రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. కానీ ఆ ఉత్సాహం కొన్ని గంటలకే పరిమితం అయింది. ‘గని’కి డేట్ ఇచ్చిన రోజే ‘భీమ్లా నాయక్’ను ముందు అన్న ప్రకారమే ఫిబ్రవరి 25కే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఆ తర్వాత ఆ ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ జరగలేదు.
అనుకున్నట్లే శుక్రవారం ఆ సినిమా రిలీజైపోయింది. దీంతో ‘గని’ని మరోసారి వాయిదా వేసి కొత్త డేట్ కోసం ఎదురు చూస్తోంది చిత్ర బృందం. ఇంకోసారి డేట్ ఇచ్చి.. తర్వాత మారిస్తే బాగోదని అన్నీ చూసుకున్నాకే విడుదల తేదీని ప్రకటిద్దామని చూస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ల దృష్టిలో ఉన్న డేట్ అయితే ఏప్రిల్ 1 అని సమాచారం. అసలు అది తప్ప వేసవిలో వేరే డేట్ దొరికే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
ఏప్రిల్ 1కి ముందు ‘సర్కారు వారి పాట’ను అనుకున్నారు. తర్వాత ‘భీమ్లా నాయక్’ ఆ తేదీకి రావచ్చన్నారు.
ఆపై ‘ఆచార్య’నూ ఆ తేదీకే ఫిక్స్ చేశారు. కానీ ఈ మూడు చిత్రాల్లో ఏదీ ఆ తేదీని వాడుకోలేదు. మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీ వస్తుండటంతో ఏప్రిల్ 1న వేరే చిత్రాలను రిలీజ్ చేయడానికి కొంచెం భయపడుతున్నారు. ఐతే ‘గని’ టీం ఇప్పుడు ఆ తేదీని వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీం కళ్లు కూడా ఇప్పుడు ఆ డేట్ మీదే పడ్డాయట. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. మార్చి 1న టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్ల హడావుడి మొదలైందంటే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నట్లే. రెండూ మీడియం రేంజ్ చిత్రాలే కాబట్టి ఏప్రిల్ 1నే గని, రామారావు ఆన్ డ్యూటీ ఏప్రిల్ 1నే వస్తే ఆశ్చర్యమేమీ లేదు. కనీసం ఇందులో ఒక్కటైనా ఆ తేదీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on February 27, 2022 12:23 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…