టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో మొదలుపెట్టారు. దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ అక్కడే జరగనుంది. ఈ షూటింగ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను లీక్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది చిత్రబృందం.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ముందుగా నటుడు శ్రీకాంత్ ను విలన్ గా తీసుకున్నారు. దీంతో ఆయనే మెయిన్ విలన్ అయి ఉంటారని అందరూ భావించారు. కానీ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ లో తమిళనటుడు ఎస్.జె.సూర్య కనిపించబోతున్నారు. మహేష్ నటించిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సూర్య. ఇప్పుడు రామ్ చరణ్ కి విలన్ గా నటించబోతున్నారు.
కథ ప్రకారం.. సినిమాలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారట. ఏ ముఖ్యమంత్రికి, ఎన్నికల కమిషనర్ గా మధ్య నడిచే సమరమే ఈ సినిమా. నిజాయితీ గల ఆఫీసర్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. సీఎంతో ఎలెక్షన్ కమిషనర్ జరిగే వార్, వారిద్దరి మధ్య ఈగో క్లాషెస్ తో సినిమా నడుస్తుందట. మెయిన్ విలన్ ఎస్.జె. సూర్య అయినప్పటికీ.. శ్రీకాంత్ పాత్రలో కూడా నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో అంజలి, సునీల్ లాంటి తారలు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందని.. డిజిటల్ రైట్స్, శాటిలైట్స్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇలా అన్నింటికి కలిపి దాదాపు 350 కోట్లకు పైగా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
This post was last modified on February 23, 2022 3:37 pm
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…