టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో మొదలుపెట్టారు. దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ అక్కడే జరగనుంది. ఈ షూటింగ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను లీక్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది చిత్రబృందం.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ముందుగా నటుడు శ్రీకాంత్ ను విలన్ గా తీసుకున్నారు. దీంతో ఆయనే మెయిన్ విలన్ అయి ఉంటారని అందరూ భావించారు. కానీ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ లో తమిళనటుడు ఎస్.జె.సూర్య కనిపించబోతున్నారు. మహేష్ నటించిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సూర్య. ఇప్పుడు రామ్ చరణ్ కి విలన్ గా నటించబోతున్నారు.
కథ ప్రకారం.. సినిమాలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారట. ఏ ముఖ్యమంత్రికి, ఎన్నికల కమిషనర్ గా మధ్య నడిచే సమరమే ఈ సినిమా. నిజాయితీ గల ఆఫీసర్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. సీఎంతో ఎలెక్షన్ కమిషనర్ జరిగే వార్, వారిద్దరి మధ్య ఈగో క్లాషెస్ తో సినిమా నడుస్తుందట. మెయిన్ విలన్ ఎస్.జె. సూర్య అయినప్పటికీ.. శ్రీకాంత్ పాత్రలో కూడా నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో అంజలి, సునీల్ లాంటి తారలు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందని.. డిజిటల్ రైట్స్, శాటిలైట్స్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇలా అన్నింటికి కలిపి దాదాపు 350 కోట్లకు పైగా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
This post was last modified on February 23, 2022 3:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…