టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో మొదలుపెట్టారు. దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ అక్కడే జరగనుంది. ఈ షూటింగ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను లీక్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది చిత్రబృందం.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ముందుగా నటుడు శ్రీకాంత్ ను విలన్ గా తీసుకున్నారు. దీంతో ఆయనే మెయిన్ విలన్ అయి ఉంటారని అందరూ భావించారు. కానీ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ లో తమిళనటుడు ఎస్.జె.సూర్య కనిపించబోతున్నారు. మహేష్ నటించిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సూర్య. ఇప్పుడు రామ్ చరణ్ కి విలన్ గా నటించబోతున్నారు.
కథ ప్రకారం.. సినిమాలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారట. ఏ ముఖ్యమంత్రికి, ఎన్నికల కమిషనర్ గా మధ్య నడిచే సమరమే ఈ సినిమా. నిజాయితీ గల ఆఫీసర్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. సీఎంతో ఎలెక్షన్ కమిషనర్ జరిగే వార్, వారిద్దరి మధ్య ఈగో క్లాషెస్ తో సినిమా నడుస్తుందట. మెయిన్ విలన్ ఎస్.జె. సూర్య అయినప్పటికీ.. శ్రీకాంత్ పాత్రలో కూడా నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో అంజలి, సునీల్ లాంటి తారలు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందని.. డిజిటల్ రైట్స్, శాటిలైట్స్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇలా అన్నింటికి కలిపి దాదాపు 350 కోట్లకు పైగా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
This post was last modified on February 23, 2022 3:37 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…