టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో మొదలుపెట్టారు. దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ అక్కడే జరగనుంది. ఈ షూటింగ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను లీక్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది చిత్రబృందం.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ముందుగా నటుడు శ్రీకాంత్ ను విలన్ గా తీసుకున్నారు. దీంతో ఆయనే మెయిన్ విలన్ అయి ఉంటారని అందరూ భావించారు. కానీ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ లో తమిళనటుడు ఎస్.జె.సూర్య కనిపించబోతున్నారు. మహేష్ నటించిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సూర్య. ఇప్పుడు రామ్ చరణ్ కి విలన్ గా నటించబోతున్నారు.
కథ ప్రకారం.. సినిమాలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారట. ఏ ముఖ్యమంత్రికి, ఎన్నికల కమిషనర్ గా మధ్య నడిచే సమరమే ఈ సినిమా. నిజాయితీ గల ఆఫీసర్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. సీఎంతో ఎలెక్షన్ కమిషనర్ జరిగే వార్, వారిద్దరి మధ్య ఈగో క్లాషెస్ తో సినిమా నడుస్తుందట. మెయిన్ విలన్ ఎస్.జె. సూర్య అయినప్పటికీ.. శ్రీకాంత్ పాత్రలో కూడా నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో అంజలి, సునీల్ లాంటి తారలు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందని.. డిజిటల్ రైట్స్, శాటిలైట్స్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇలా అన్నింటికి కలిపి దాదాపు 350 కోట్లకు పైగా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…
హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…
కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…
నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…
పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…