టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా తొలిసారి జంటగా నటించిన చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. రాధిక, ఖుష్బు, ఊర్వశీ లు లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. కుంటుంబ విలువలు, బంధాలు నేపథ్యంలో మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న గ్రాండ్గా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. కొత్త కొత్త పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్.. ఇలా ఒక్కోటి బయటకు వదులుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో `భీమ్లా నాయక్` బరిలోకి దిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు నటించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్లో విడుదల అవుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఫిబ్రవరి 25వ తేదీనే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ శర్వానంద్ వెనక్కి తగ్గలేదు. చెప్పిన తేదీకే తన సినిమాను తీసుకురావాలనే పట్టదలతో.. మరింత జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అయితే ఇలాంటి టైమ్లో శర్వాకు మరో ఊహించని తలనొప్పి మొదలైంది. భీమ్లానాయక్ చిత్రాన్ని సోలోగా విడుదల చేయాలని నిశ్చయించుకున్న నాగవంశి పక్కా ప్లానింగ్తో ముందే ఓవర్సీస్, గుంటూరు, వెస్ట్ , ఈస్ట్ పంపిణీ హక్కులను తన ఫ్రెండ్స్కు విక్రయించాడట. దీంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమాకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి సహకారం అందడం లేదని టాక్ నడుస్తోంది. ఇదే ఇప్పుడు చిత్ర టీమ్కు పెద్ద తలనొప్పిగా మారిందట. మరి శర్వా ఈ సమస్య నుంచి గట్టెక్కి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడా..? లేక చివరి నిమిషంలో వెనక్కి తగ్గుతాడా..? అన్నది చూడాలి.
This post was last modified on February 17, 2022 12:15 pm
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…